E-Paper
Advertisement

Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌ కార్యాలయానికి నిప్పు.. కోటంరెడ్డి చేయించారని ఆరోపణ..

Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌ కార్యాలయానికి నిప్పు.. కోటంరెడ్డి చేయించారని ఆరోపణ..
Advertisement

Borugadda Anil : గుంటూరులోని డొంకరోడ్డులో ఉన్న బోరుగడ్డ అనిల్ క్యాంపు కార్యాలయానికి దుండగులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఆఫీస్ పై పెట్రోలు పోసి తగులబెట్టారు. భారీగా ఎగిసిపడిన మంటలకు కార్యాలయంలో ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన ఏపీవ్యాప్తంగా అలజడి రేపింది.

ఇటీవల నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఫోన్‌లో బోరుగడ్డ అనిల్‌ బెదిరించడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఆయన కార్యాలయం తగులబెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కార్యాలయాన్ని దగ్ధం చేయడంపై బోరుగడ్డ అనిల్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డే తన ఆఫీస్ ను తగులబెట్టించారని ఆరోపించారు. కోటంరెడ్డికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు కొందరు సహకరించారని ఆరోపించారు.

Advertisement

కొద్దిరోజుల క్రితం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బోరుగడ్డ అనిల్ ఫోన్ లో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నెల్లూరు వీధుల్లో కోటంరెడ్డిని బండికి కట్టి కడపకు ఈడ్చుకు వెళతానంటూ హెచ్చరించడం తీవ్ర కలకలం రేపింది. సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నావని ఫోన్ లో అనిల్ .. శ్రీధర్ రెడ్డిని నిలదీశారు.

బోరుగడ్డ అనిల్ ఫోన్ కాల్ తర్వాత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన స్వరాన్ని మరింత పెంచారు. బెదిరింపులకు తగ్గదేలేదని స్పష్టం చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి.. అనిల్ చేత తనను బెదిరించారని ఆరోపించారు. తనకు ఆడియో కాల్స్ వస్తే.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి సజ్జలకు వీడియో కాల్స్ వస్తాయని హెచ్చరికలు పంపారు. ఇలా వైసీపీ నేతలకు కోటంరెడ్డి మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బోరుగడ్డ అనిల్ ఆఫీస్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టడం మరో వివాదాన్ని రేపింది. టీడీపీ నేతల సహకారంతో కోటంరెడ్డి తన ఆఫీస్ ను తగులబెట్టించారని బోరుగడ్డ అనిల్ ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతల స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×