E-Paper
Advertisement

Earthquake: టర్కీలో రెండుగా చీలిపోయిన రన్‌వే..

Earthquake: టర్కీలో రెండుగా చీలిపోయిన రన్‌వే..
Advertisement

Earthquake: టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. భవనాలు పేకమేడల్లా కూలిపోవడంతో వేలాది మంది శిథిలాల కింద చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సాయం కోసం శిథిలాల కింద వేచిచూస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని కలచివేస్తోంది.

ఇక భూ ప్రకంపనల ధాటికి టర్కీలోని హతయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పూర్తిగా ధ్వంసమైంది. పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండు ముక్కలుగా చీలిపోవడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం రెండుగా చీలిపోయిన రన్‌వేకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Advertisement

ఇప్పటి వరకు రెండు దేశాల్లో కలిసి దాదాపు 5,600 భవనాలు నేలమట్టమయ్యాయి. 4,500 మందికిపైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 20 వేల మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో 20 వేల మందికి పైగా మృత్యువాత పడి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) అంచనా వేసింది.

భారత్ సహా అనేక దేశాలు ప్రకృతి విపత్తుతో అతలాకుతలమైన టర్కీ, సిరియాలకు సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ఇవాళ భారత్ సహాయక బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సహాయక సామాగ్రితో కూడిన ఓ విమానాన్ని టర్కీకి పంపించింది.


Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×