E-Paper
Advertisement

BR Naidu: పవన్ పై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

BR Naidu: పవన్ పై కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
Advertisement

BR Naidu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాను ఎటువంటి కామెంట్స్ చేయలేదని టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు వివరణ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్ నాయుడు చేసిన కామెంట్స్ పై జనసేన నాయకులు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ఇదే విషయాన్ని బిగ్ టీవీ ప్రచురించగా చైర్మన్ స్పందించారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.

సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే తాను కామెంట్స్ చేసినట్లు చైర్మన్ క్లారిటీ ఇచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై మీడియా సమావేశం నిర్వహించిన చైర్మన్ ను మీడియా ప్రతినిధులు పలు ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఎవరో ఏదో చెబితే వాటికి స్పందించాల్సిన అవసరం లేదంటూ చైర్మన్ బదులిచ్చారు. పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలని కోరారు కదా అంటూ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ వీడియో వైరల్ గా మారింది. దీనితో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు టీటీడీ చైర్మన్ క్లారిటీ ఇవ్వడంతో జనసేన లీడర్స్ కాస్త వెనక్కు తగ్గారు.

Advertisement

Also Read: TTD Chairman BR Naidu: మృతుల కుటుంబాలకు అండగా టీటీడీ – చైర్మన్ బీఆర్ నాయుడు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదని, మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానన్నారు. ముఖ్య‌మంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాపణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చైర్మన్ అన్నారు. క్షమాపణల గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని టీటీడీ చైర్మన్ హితవు పలికారు

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×