BigTV English
Advertisement

Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. తిరుమలలో దివ్వెల మాధురి న్యూసెన్స్ రీల్స్.. కేసు నమోదు

Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. తిరుమలలో దివ్వెల మాధురి న్యూసెన్స్ రీల్స్.. కేసు నమోదు

Case registered against Divvela Madhuri in Tirumala: వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. అతని సన్నిహితురాలు దివ్వెల మాధురిపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని సన్నిధిలో శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయంలో ఫొటో షూట్ చేశారు.


అలాగే పవిత్రమైన తిరుమల మాడవీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేసింది ఫిర్యాదులు అందాయి. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ వ్యక్తిగత బంధాల గురించి మాట్లాడారని ఆరోపించారు. ఈ కారణాలతో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు.

దీంతో దివ్వెల మాధురితో పాటు దువ్వాడ శ్రీనివాస్‌పై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రజల మనోభావాలను దెబ్బతీసేవిధంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో వ్యవహరించారని 292, 296, 300 బీఎన్ఎస్, సెక్షన్66(ఈ) ఏటీ యాక్ట్, 2000-2008 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ఇదిలా ఉండగా, గత కొంతకాలంగా దివ్వెల మాధురికి సంబంధించిన వీడియోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. దువ్వాడ సతీమణి వాణి సైతం మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Also Read: కొంపముంచిన రాసలీలల వీడియో.. ఇద్దరు కీలక నేతల రాజీనామా!

అయితే, ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తిరుమలకు వచ్చిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు ఫొటో షూట్ తెలిసి కావాలనే చేయించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటివి తిరుమల కొండపై నిషేధమని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు.

భక్తితో మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలని, అనవసర విధానాలపై ధ్యాస వెళ్లకూడదని సూచిస్తున్నారు. ఒక ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్.. శ్రీవారి సన్నిధిలో ఇలాంటివి చేయ్యకూడదని చెప్పడం తెలియదా అంటున్నారు. ఇవేమి తెలియకుండా.. అతనే దగ్గరుండి రీల్స్, ఫొటోలు తీయించడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×