E-Paper
Advertisement

Viveka Murder Case : వివేకా హత్యకేసులో మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణ రెడీ: అవినాష్ రెడ్డి

Viveka Murder Case : వివేకా హత్యకేసులో మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణ రెడీ: అవినాష్ రెడ్డి

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. వివేకా హత్య కేసులో కీలకపాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు ప్రశ్నించారు.

మార్చి 6న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ శనివారం నోటీసులు ఇచ్చింది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అయితే మార్చి 6న విచారణకు రాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు స్పష్టం చేశారు. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోతున్నానని లేఖ రాశారు. దీంతో ఆదివారం రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి మరోసారి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

జవవరి 28, ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన అధికారులు మరోసారి ఎంపీని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ కూడా సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. ఆయన కూడా విచారణ హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.

విచారణకు రెడీ..
వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, గృహ సారథులు, వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. తన తండ్రి భాస్కర్‌రెడ్డి ఈ నెల 12న కడపలో విచారణకు హాజరవుతారని చెప్పారు. తండ్రీకొడుకుల విచారణ తర్వాత సీబీఐ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×