E-Paper
Advertisement

Viveka Murder Case : వివేకా హత్యకేసులో మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణ రెడీ: అవినాష్ రెడ్డి

Viveka Murder Case : వివేకా హత్యకేసులో మళ్లీ సీబీఐ నోటీసులు.. విచారణ రెడీ: అవినాష్ రెడ్డి
Advertisement

Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగంగా సాగుతోంది. ఈ కేసు ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. వివేకా హత్య కేసులో కీలకపాత్రదారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రెండుసార్లు ప్రశ్నించారు.

మార్చి 6న హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ శనివారం నోటీసులు ఇచ్చింది. సీబీఐ అధికారులు శనివారం రాత్రి పులివెందులలోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. అయితే మార్చి 6న విచారణకు రాలేనని ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు స్పష్టం చేశారు. ముందస్తుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల రాలేకపోతున్నానని లేఖ రాశారు. దీంతో ఆదివారం రాత్రి పులివెందులలోని ఆయన ఇంటికి మరోసారి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు. ఈ నెల 10న హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement

జవవరి 28, ఫిబ్రవరి 24న హైదరాబాద్ లోని కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వివిధ కోణాల్లో ప్రశ్నించారు. ఇప్పటికే కీలక సమాచారం సేకరించిన అధికారులు మరోసారి ఎంపీని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. మరోవైపు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి చుట్టూ కూడా సీబీఐ ఉచ్చుబిగిస్తోంది. ఆయన కూడా విచారణ హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చింది.

విచారణకు రెడీ..
వేంపల్లిలో జరిగిన వైసీపీ మండల నాయకులు, గృహ సారథులు, వాలంటీర్ల సమావేశంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి.. తాజాగా సీబీఐ ఇచ్చిన నోటీసులపై స్పందించారు. నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతానని తెలిపారు. తన తండ్రి భాస్కర్‌రెడ్డి ఈ నెల 12న కడపలో విచారణకు హాజరవుతారని చెప్పారు. తండ్రీకొడుకుల విచారణ తర్వాత సీబీఐ తీసుకునే నెక్ట్స్ స్టెప్ ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×