E-Paper
Advertisement

CBI: వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు..

CBI: వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు..
Advertisement

CBI: బిగ్ బ్రేకింగ్ న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసుకు రావాలని నోటీసులో తెలిపింది. సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయం.. జగన్ కు బిగ్ షాక్ అని చెబుతున్నారు. అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి.

తన ఇంట్లో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. ఇంకా కేసు కొలిక్కి రాకపోవడంతో మరింత పకడ్బందీగా విచారించాలని డిసైడ్ అయినట్టుంది. వివేక హత్య కేసులో మొదటి నుంచీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. హత్య జరిగిన స్పాట్ లో రక్తపు మరకలు తుడిచేయించడం, ఆధారాలు ధ్వంసం చేయడం లాంటి చర్యలు చేశారంటూ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. వివేకాను గొడ్డలితో నరికి చంపినా.. శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా.. ఆయన గుండెపోటులో చనిపోయారంటూ అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పడం అప్పట్లో కలకలం రేపింది.

Advertisement

వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని విచారించాలంటూ టీడీపీ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. వివేక కూతురు సునీత సైతం అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి సైతం తన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి పేరు ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ఇలా ఈ కేసులో అనేక చిక్కుముడులు ఎంపీ అవినాష్ రెడ్డి వైపే ఉండటంతో.. ఎట్టకేళకు ఆయన్ను కూడా విచారించాలని సీబీఐ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

మరి, నోటీసులు ఇచ్చిన సీబీఐ విచారణ దగ్గరే ఆగిపోతుందా? అరెస్టు చేసే అవకాశం ఉందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×