E-Paper
Advertisement

CBI: వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు..

CBI: వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు..
Advertisement

CBI: బిగ్ బ్రేకింగ్ న్యూస్. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీబీఐ. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసుకు రావాలని నోటీసులో తెలిపింది. సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయం.. జగన్ కు బిగ్ షాక్ అని చెబుతున్నారు. అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి.

తన ఇంట్లో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఏళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. ఇంకా కేసు కొలిక్కి రాకపోవడంతో మరింత పకడ్బందీగా విచారించాలని డిసైడ్ అయినట్టుంది. వివేక హత్య కేసులో మొదటి నుంచీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. హత్య జరిగిన స్పాట్ లో రక్తపు మరకలు తుడిచేయించడం, ఆధారాలు ధ్వంసం చేయడం లాంటి చర్యలు చేశారంటూ ఎంపీ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. వివేకాను గొడ్డలితో నరికి చంపినా.. శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా.. ఆయన గుండెపోటులో చనిపోయారంటూ అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పడం అప్పట్లో కలకలం రేపింది.

Advertisement

వివేకా మర్డర్ కేసులో అవినాష్ రెడ్డిని విచారించాలంటూ టీడీపీ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోంది. వివేక కూతురు సునీత సైతం అవినాష్ పాత్రపై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి సైతం తన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి పేరు ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ఇలా ఈ కేసులో అనేక చిక్కుముడులు ఎంపీ అవినాష్ రెడ్డి వైపే ఉండటంతో.. ఎట్టకేళకు ఆయన్ను కూడా విచారించాలని సీబీఐ నోటీసులు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

మరి, నోటీసులు ఇచ్చిన సీబీఐ విచారణ దగ్గరే ఆగిపోతుందా? అరెస్టు చేసే అవకాశం ఉందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Related News

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×