E-Paper
Advertisement

Chandrababu: రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచారు: చంద్రబాబు

Chandrababu: రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచారు: చంద్రబాబు
Advertisement

Chandrababu comments on Jagan(Andhra pradesh election news): రాష్ట్రంలో సీఎం జగన్ నాసిరకం మద్యాన్ని పెట్టి ఎంతో మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని జగన్ నియంతలా పాలిస్తున్నారని విమర్శించారు. డ్రైవింగ్ రాని వ్యక్తి చేతిలో రాష్ట్రం.. రివర్స్ గేర్ లో వెళ్లిందని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రంలో జగన్ ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి అతలాకుతలం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆడబిడ్డల తాళిబొట్టు తెంచాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. టీచర్లను మద్యం దుకాణాలు వద్ద కాపలా పెట్టిన ప్రభుత్వం వైసీపీది అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. స్కూళ్లకు రంగులేసినంత మాత్రాన పిల్లలకు చదువు వస్తుందా అంటూ ప్రశ్నించారు.

Advertisement

టీచర్లను మద్యం దుకాణాలు వద్ద కాపలా పెట్టిన ప్రభుత్వం వైసీపీది అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడమే జగన్ స్వభావమని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం అప్పులు వచ్చే పరిస్థితి కూడా లేకుండా చేశారంటూ ఫైరయ్యారు. ఆదాయం తగ్గి.. జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు.

ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచేస్తుంటే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా అంటూ చంద్రబాబు జగన్ ను ప్రశ్నించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకువచ్చి జగన్.. బలవంతంగా ప్రజలు ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులు, భూములపై జగన్ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం చేస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×