BigTV English
Advertisement

Chandrababu: బస్సులో బాబు.. కాంగ్రెస్‌ను ఫాలో అవుతున్నారా?

Chandrababu: బస్సులో బాబు.. కాంగ్రెస్‌ను ఫాలో అవుతున్నారా?
chandrababu in bus

Chandrababu: చంద్రబాబు 2.0 వర్షన్ చూపిస్తున్నారు. యాత్రలు, చర్చలు, గ్యారెంటీలతో వైసీపీకి సినిమా చూపిస్తున్నారు. ఏకంగా పులివెందులలోనే జగన్‌ను సవాల్ చేసి సత్తా చాటారు. తండ్రికి తోడుగా నారా లోకేశ్ యువగళంతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. రాటుదేలిన లోకేశ్.. పదునైన విమర్శలతో చెలరేగిపోతున్నారు. వీరితో సంబంధం లేకున్నా.. ముందుముందు పొత్తు పక్కా అంటున్న జనసేనాని సైతం వారాహి యాత్రతో అధికారపార్టీపై దండయాత్ర చేస్తున్నారు. అటు, బీజేపీ సైతం గేరు మార్చి వైసీపీపైకి దూసుకొస్తోంది. ఇలా జగన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది.


టీడీపీ ప్రకటించిన భవిష్యత్‌కు గ్యారెంటీని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నారు చంద్రబాబు. తాజాగా, కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు బస్సులో ప్రయాణించి.. మహిళలకు గ్యారెంటీ హామీల గురించి వివరించారు. అధికారంలోకి వచ్చాక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు.

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు నుంచి జొన్నాడ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు చంద్రబాబు. ప్రభుత్వ అరాచకాలు, పెరిగిన కరెంట్ బిల్లులు, నిత్యావసర ధరలు, చెత్త పన్ను.. ఇలా మహిళలు నేరుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారితో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ప్రకటించిన మహా శక్తి పథకం గురించి సవివరంగా చెప్పారు.


అయితే, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కర్నాటక కాంగ్రెస్ హామీని కాపీ కొట్టారంటూ ఇప్పటికే వైసీపీ విమర్శిస్తోంది. హామీ మాత్రమే కాదు.. ప్రచారంలోనూ కాంగ్రెస్‌నే ఫాలో అవుతున్నారని ఆరోపిస్తోంది. కర్నాటక ప్రచారంలో రాహుల్ గాంధీ బస్సులో ప్రయాణించి ప్రయాణీకులతో మాట్లాడారని.. ఇప్పుడు చంద్రబాబు సైతం రాహుల్ మాదిరే బస్ ఎక్కి మాట్లాడారంటూ ఎద్దేవా చేస్తున్నారు.

మరోవైపు, కోనసీమ జిల్లా మండపేటలో పంచాయతీరాజ్ వ్యవస్థపై.. సర్పంచులతో సమావేశమయ్యారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. సర్పంచ్‌లకు చెక్ పవర్ లేకుండా చేశారని..గ్రామంలో ఏ పని చేయాలన్న కనీసం నిధులు ఇవ్వని పరిస్థితి దాపరించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక సర్పంచ్‌లకు పూర్వ వైభవం తీసుకువచ్చే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

అటు, ఆలమూరు మండలం జొన్నాడలో ఇసుక కొండలను చంద్రబాబు పరిశీలించారు. ఇసుక మేటలు దగ్గర సెల్పీ చాలెంజ్ విసిరారు. ఏడాదికి 228 కోట్లు కొల్లగొడుతున్న జేపీ వెంచర్‌పై 24 గంటల్లో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×