E-Paper
Advertisement

CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: రైతులకు గుడ్ న్యూస్.. ముంబై, కోల్‌కతాకు అరటి ఎగుమతులు.. పత్తి రైతులకు సీఎం భరోసా!

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని అరటి, పత్తి, మొక్కజొన్న రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యాన, మార్కెటింగ్ శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల కొనుగోళ్లు, మార్కెటింగ్ సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రాయలసీమలో దాదాపు 40 వేల హెక్టార్లలో సాగవుతున్న అరటి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సీఎం ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్థానిక మార్కెట్లతో పాటు ముంబై, కోల్‌కతా వంటి సుదూర ప్రాంతాలకు అరటిని ఎగుమతి చేయాలని సూచించారు. ఇందుకోసం రైల్వే వ్యాగన్లను వినియోగించుకోవాలని, రవాణా కోసం ప్రత్యేక ఏజెన్సీల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారం నుంచి ధరలు పెరిగే అవకాశం ఉన్నందున, అప్పటివరకు రైతులు నష్టపోకుండా వ్యాపారులతో నిత్యం సమావేశాలు నిర్వహించి ధరలను పర్యవేక్షించాలన్నారు.

మొక్కజొన్న రైతులకు అండగా ఉండేందుకు ‘ధరల స్థిరీకరణ నిధి’ని వినియోగించాలని సీఎం నిర్ణయించారు. మార్కెట్లో మద్దతు ధర లభించని పక్షంలో, ఆ వ్యత్యాసాన్ని నిధి ద్వారా చెల్లించే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సీజన్‌లో 1.42 లక్షల హెక్టార్లలో సాగైన పంట నుంచి 2.04 లక్షల మెట్రిక్ టన్నులను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు.

ఇక పత్తి కొనుగోళ్లపై కేంద్రానికి లేఖ రాసినట్లు సీఎం తెలిపారు. రానున్న రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆదేశించారు. సీసీఐ (CCI) నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని, రంగు మారిన లేదా తడిచిన పత్తిని కూడా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్లాట్ బుకింగ్ సమస్యలు రాకుండా, జిన్నింగ్ మిల్లులకే నేరుగా రవాణా చేసేలా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Read Also: JAGAN-KTR Photo: బెంగళూరులో ఒకే వేదికపై జగన్, కేటీఆర్.. ఫోటో వైరల్

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×