E-Paper
Advertisement

PM Kisan Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు

PM Kisan Annadata Sukhibhava: రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసిన చంద్రబాబు
Advertisement

PM Kisan Annadata Sukhibhava: వైఎస్సార్‌ కడప జిల్లా పెండ్లిమర్రిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, “పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ” పథకం రెండో విడత నిధులను విడుదల చేశారు. స్థానిక ప్రజావేదిక నుంచి ఆయన ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 47 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చేలా, మొత్తం రూ. 3,200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ విడతలో ఒక్కో రైతు ఖాతాలో రూ. 7,000 చొప్పున జమ కానున్నాయి. అంతకుముందు సీఎం ‘మన గ్రోమోర్‌’ ఎరువుల కేంద్రాన్ని సందర్శించి, అక్కడి రైతులతో ముచ్చటించారు. వ్యవసాయ పెట్టుబడి సాయం కింద ఈ నిధులు రైతులకు అండగా ఉంటాయని చంద్రబాబు తెలిపారు.

Advertisement

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..  నేడు రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామన్నారు. ఈ స్కీమ్ కింద తొలి విడతలో 3,174 కోట్ల రూపాయలు ఆగష్టులో జమ చేశామన్న సీఎం.. రెండో విడత 3135 కోట్లు మీ అకౌంట్ లో జమ చేసినట్లు తెలిపారు. వ్యవసాయం లాభసాటి కావాలని, రైతుల జీవితాలు బాగుపడాలని అన్నారు. రైతులు కొత్తగా ఆలోచించి వ్యవసాయం చేయాలని, ఆధునిక పద్దతులు అవలంభించి సాగు చేయాలని సీఎం కోరారు. మనం పండించిన పంటలు ప్రపంచానికి చేరువ చేసినప్పుడు రైతులు బాగుంటారని అన్నారు.

రైతుల భవిష్యత్తును మార్చేందుకు ఐదు ‘పంచ సూత్రాలను’ (నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రి-టెక్, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ప్రభుత్వ సహకారం) సీఎం ప్రతిపాదించారు. ముఖ్యంగా నీటి భద్రతపై మాట్లాడుతూ, రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చి, శ్రీశైలం నీటిని సీమకు మళ్లించడం వల్లే నేడు ఈ ప్రాంతంలోని రిజర్వాయర్లు 95 శాతం నిండుకుండలా మారాయని, ఇది తన దూరదృష్టికి నిదర్శనమని చంద్రబాబు వివరించారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×