BigTV English
Advertisement

Chandrababu SPG Increased: బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా..?

Chandrababu SPG Increased: బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా..?

Central Increased SPG Security to Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై కేంద్రం దృష్టి పెట్టింది. ఏకంగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థులపై దాడి పాల్పడడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం వేటు వేసింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడులకు పాల్పడ్డారు అల్లరి మూకలు. పరిస్థితి గమనించిన కేంద్రం, ఆయనకు ఇచ్చే ఎస్పీజీ సెక్యూరిటీని అమాంతంగా పెంచింది.


ప్రస్తుతం చంద్రబాబుకు 12 మంది ఉన్నారు. దాన్ని ఇప్పుడు 24కు పెంచింది. 12 x 12 రెండు బ్యాచ్‌లుగా 24 మంది బ్లాక్ కమెండోలను కేటాయించింది. రెండురోజుల కేంద్రం నుంచి వచ్చిన భద్రతా అధికారుల టీమ్, చంద్రబాబు నివాసం, టీడీపీ కార్యాలయం, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి కరకట్ట మీదుగా చంద్రబాబు ఇంటికి వెళ్లే ప్రాంతాలను పరిశీలించినట్లు వార్తలు వస్తున్నాయి.

అవన్నీ ప్రత్యర్థులు దాడి చేసేందుకు అనుకూలంగా ఉంటుందని భావించింది. ఈ క్రమంలో కేంద్రానికి భద్రతా సంస్థలు రిపోర్టు ఇవ్వడం జరిగిపోయింది. పోలింగ్ తర్వాత విపక్ష అభ్యర్థులపై వైసీపీ సానుభూతిపరులు దాడులకు పాల్పడ్డారు. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, భద్రతను పెంచింది.


గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇంటిపైకి వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తన మద్దతుదారులతో దూసుకువచ్చారు. ఆ సమయంలో చంద్రబాబును బయటకు రాకుండా గేట్‌కు తాళాలు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఉమ్మడి కృష్ణాజిల్లాలో రాళ్లతో దాడి జరిగింది. ఆ ఘటనలో బాబు ఎస్పీజీ సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఈ పరిణామాలను బేరీజు వేసుకున్న కేంద్రం, ఉన్న భద్రతను అమాంతంగా పెంచేసింది.

ALSO READ: ఏపీ ప్రజలకు పవన్ కళ్యాణ్ లేఖ.. మీ ప్రేమ కదిలించిందంటూ..

గురువారం కేంద్రం ఎన్నికల అధికారులతో ఏపీ సీఎస్, డీజీపీతోపాటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా హాజరయ్యారు. ఆయన కూడా చంద్రబాబు భద్రతపై రిపోర్టు ఇచ్చినట్టు వార్తలు లేకపోలేదు. ఎట్ ద సేమ్ టైమ్.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెక్యూటీని తగ్గించి చంద్రబాబు రక్షణ పెంచడంపైనా ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు జోరుందుకున్నాయి.

Tags

Related News

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

Big Stories

×