E-Paper
Advertisement

Chandrababu CID : మూడు కేసులు.. మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు

Chandrababu CID : మూడు కేసులు.. మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు
Advertisement

Chandrababu CID : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒకేసారి మూడు సీఐడీ కార్యాలయాలకు వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కుంభకోణం, ఇసుక పాలసీ కేసుల్లో.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలానే వారం రోజుల్లోగా సీఐడీ దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు.. చంద్రబాబు నేసు సీఐడీ ఆఫీస్ లకు వెళ్ళి పూచీకత్తును సమర్పించనున్నారు. అయితే ఈ కేసుల్లో బెయిల్ మంజూరు నేపధ్యంలో కోర్టు పలు సూచనలు చేసింది. సీఐడీ మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ఠ కాలపరిమితితో నోటీసులు ఇవ్వాలని వెల్లడించింది. చంద్రబాబుకు కూడా కొన్ని కండీషన్లు విధించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమం లోనే ఈరోజు మధ్యాహ్నం 1.30కి హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు రానున్నారు. ఆ తర్వాత 3 గంటలకు గుంటూరు సీఐడీ రీజినల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 కి కుంచనపల్లి లోని సీఐడీ కార్యాలయానికి వెళ్ళి పూచీకత్తు, షూరిటీలను.. చంద్రబాబు సమర్పించనున్నారు. ఇక చివరగా సాయంత్రం 5 గంటలకు విజయవాడ తాడిగడపలో ఉన్న రీజినల్ సీఐడీ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ కూడా అధికారులకు సంబంధిత డాక్యుమెంట్స్ ని అందించనున్నారు.

Advertisement

కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో.. సీఐడీ చంద్రబాబును ఏ1గా పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఆ కేసుతో పాటుగా మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేసారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ3గా నమోదు చేసింది. మరో కేసు అయిన ఇసుక పాలసీ వ్యవహారంలో సైతం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీబీఐ కేసు నమోదు చేసింది.

.

Advertisement

.

Related News

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

మరోసారి కంటతడి పెట్టిన బొత్స.. ఓదార్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు!

Big Stories

Advertisement
×