E-Paper
Advertisement

Chandrababu CID : మూడు కేసులు.. మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు

Chandrababu CID : మూడు కేసులు.. మూడు సీఐడీ కార్యాలయాలకు చంద్రబాబు

Chandrababu CID : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేడు ఒకేసారి మూడు సీఐడీ కార్యాలయాలకు వెళ్లనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కుంభకోణం, ఇసుక పాలసీ కేసుల్లో.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఒకేసారి మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలానే వారం రోజుల్లోగా సీఐడీ దర్యాప్తు అధికారికి పూచీకత్తును సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు.. చంద్రబాబు నేసు సీఐడీ ఆఫీస్ లకు వెళ్ళి పూచీకత్తును సమర్పించనున్నారు. అయితే ఈ కేసుల్లో బెయిల్ మంజూరు నేపధ్యంలో కోర్టు పలు సూచనలు చేసింది. సీఐడీ మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ఠ కాలపరిమితితో నోటీసులు ఇవ్వాలని వెల్లడించింది. చంద్రబాబుకు కూడా కొన్ని కండీషన్లు విధించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమం లోనే ఈరోజు మధ్యాహ్నం 1.30కి హైదరాబాద్ నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి టీడీపీ ఆఫీస్ కు చంద్రబాబు రానున్నారు. ఆ తర్వాత 3 గంటలకు గుంటూరు సీఐడీ రీజినల్ ఆఫీస్ కు వెళ్లనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 కి కుంచనపల్లి లోని సీఐడీ కార్యాలయానికి వెళ్ళి పూచీకత్తు, షూరిటీలను.. చంద్రబాబు సమర్పించనున్నారు. ఇక చివరగా సాయంత్రం 5 గంటలకు విజయవాడ తాడిగడపలో ఉన్న రీజినల్ సీఐడీ ఆఫీస్ కు వెళ్ళి అక్కడ కూడా అధికారులకు సంబంధిత డాక్యుమెంట్స్ ని అందించనున్నారు.

కాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో.. సీఐడీ చంద్రబాబును ఏ1గా పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఆ కేసుతో పాటుగా మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్దంగా అనుమతులు మంజూరు చేసారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ3గా నమోదు చేసింది. మరో కేసు అయిన ఇసుక పాలసీ వ్యవహారంలో సైతం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సీబీఐ కేసు నమోదు చేసింది.

.

.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×