E-Paper
Advertisement

Tirumala : నడకదారిలో చిరుతల సంచారం.. ఎన్ని ఉన్నాయంటే..?

Tirumala : నడకదారిలో చిరుతల సంచారం.. ఎన్ని ఉన్నాయంటే..?

Tirumala : అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తోంది. దర్శనం కోసం వెళ్తున్న భక్తులపై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. ఓ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మరో బాలికి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత భక్తులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చిరుతలను బంధించే ఆపరేషన్ టీటీడీ అధికారులు చేపట్టారు. అలిపిరి మార్గంలో చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు.

దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తులు నడకమార్గంలో భయాందోళన చెందుతున్నారు. అయితే అలిపిరి మార్గంలో 8 చిరుతలు సంచరిస్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను టీటీడీ ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఖండించారు. అందులో ఎంతమాత్రం నిజం లేదన్నారు. 8 చిరుతలు సంచారమనేది కేవలం రూమర్ మాత్రమేనని కొట్టిపారేశారు. ఇప్పటివరకు 4 చిరుతలను మాత్రమే గుర్తించామని చెప్పారు.

నడకదారి భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఫారెస్ట్ అధికారి తెలిపారు. చిరుతలను గుర్తించడానికి ప్రత్యేకంగా 220 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. దీని వల్ల చిరుతల సంచారాన్ని సులభంగా గుర్తించవచ్చని అన్నారు. చిరుతల బెడదపై దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారం కోసం టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకే ఏపీ అటవీశాఖ అనుమతులతో చిరుతలను బంధించేందుకు ప్రత్యేక బోనుల ఏర్పాటు చేశామని తెలిపారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×