E-Paper
Advertisement

CM Chandrababu: మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు, ఉచిత విద్య

CM Chandrababu: మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు, ఉచిత విద్య
Advertisement

CM Chandrababu: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 20కి చేరడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 9 మంది పరిస్థితి విషమంగా ఉందని.. వారిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారిలో అత్యధికులు నిరుపేద వర్గాలకు చెందిన కూలీలని.. అందులోనూ 12 మంది ఎస్సీలు.. 9 మంది మహిళలు ఉండటం హృదయవిదారకమని ఆయన పేర్కొన్నారు.

ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై ముఖ్యమంత్రి ఉక్కుపాదం మోపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఆర్‌టీఓ (RTO).. డీఎస్పీ (DSP).. డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్.. ఫైర్ ఆఫీసర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో సమగ్ర విచారణ జరిపి తప్పు చేసిన వారెవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేలుడు సంభవించిన పరిశ్రమ యాజమాన్యంపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని.. అవసరమైతే వారికి జీవిత ఖైదు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోషుల ఆస్తులను జప్తి చేసి ఆ నిధులను బాధితుల సంక్షేమానికి మళ్లిస్తామని వెల్లడించారు.

Advertisement

బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు సీఎం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 2 లక్షలతో కలిపి ఒక్కో కుటుంబానికి మొత్తం రూ. 22 లక్షల సాయం లభిస్తుంది. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని.. వారిని రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించి చదివిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని బాధితులకు ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు.

రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా సరికొత్త నిబంధనలు (SOP) తీసుకువస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. బాణసంచా తయారీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేలుడు పదార్థాల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు పాటించని వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నిరుపేద కూలీల ప్రాణాలతో చెలగాటమాడే విచ్చలవిడితనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Advertisement

Read Also: Kakinada Explosion: వేటపాలెం పేలుడు ఘటనలో గుండె పగిలే.. లైవ్ విజువల్స్!

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×