E-Paper
Advertisement

Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో

Fakhar Zaman : పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే అండంగా దొరికిపోయారు, ఇదిగో వీడియో
Advertisement

Fakhar Zaman :  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  నేపథ్యంలో ఇవాళ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka)  మధ్య మ్యాచ్ జరుగుతోంది. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ అద్భుతంగా ఆడింది. శ్రీలంక ముందు భారీ టార్గెట్ పెట్టింది. అయితే, ఈ మ్యాచ్ లో ఫిక్సింగ్ ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) ఔట్ అయినప్పటికీ, ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. అటు క్లియర్ గా బ్యాట్ తగిలినప్పటికీ కూడా శ్రీలంక రివ్యూ తీసుకోలేదు. ఫలితంగా ఫఖార్ జమాన్ ఏకంగా 84 పరుగులు చేసి ఇరగదీశాడు. ఈ దెబ్బకు పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగులు సాధించగలిగింది. దీంతో ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) ఔట్ వివాదంపై అంత‌ర్జాతీయంగా చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై ఐసీసీ ( ICC) విచార‌ణ చేయాల‌ని నెటిజెన్స్ కోరుతున్నారు.

Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శ‌ర్మకు ఘోర అవ‌మానం…చెప్పులు చూపించిన యువ‌రాజు

పాకిస్తాన్ తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్‌..లైవ్ మ్యాచ్ లోనే 

Advertisement

టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా పల్లెకెలే వేదికగా ( Pallekele International Cricket Stadium, Pallekele) వేదికగా శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 8 మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా పాకిస్తాన్ రాణించింది. మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ సందర్భంగా ఎనిమిది వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది పాకిస్తాన్. శ్రీలంక ఓపెనర్ ఫర్హాన్ ( Sahibzada Farhan) మరోసారి సెంచరీ తో రెచ్చిపోయాడు.

166 స్ట్రైక్ రేట్ సాధించిన ఫర్హాన్, 100 పరుగులు సాధించాడు. 60 బంతుల్లోనే సెంచరీ చేయడం గమనార్హం. ఇందులో 5 సిక్సర్లు అలాగే తొమ్మిది బౌండరీలు ఉన్నాయి. అటు మరో ఓపెనర్ ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) 42 బంతుల్లో 84 పరుగులు చేసి ఇరగదీశాడు. అయితే ఫఖార్ జమాన్ ( Fakhar Zaman) బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వివాదంగా మారింది. అతడు 20 లోపే పరుగులు ఉన్నప్పుడు కీపర్ క్యాచ్ అవుట్ అయ్యాడు. కానీ ఫీల్డ్ అంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. అటు శ్రీలంక క్రికెటర్లు కూడా రివ్యూ తీసుకోలేదు. తీరా ఆల్ట్రా ఎడ్జ్ లో మాత్రం బ్యాట్ ను బంతి తగిలినట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో ఫిక్సింగ్ ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి.

Advertisement

అంపైర్లు అలాగే శ్రీలంక ప్లేయర్లు, పాకిస్తాన్ కు అమ్ముడుపోయారని నెటిజెన్స్ సీరియస్ అవుతున్నారు. పాకిస్తాన్ ను సెమీ ఫైనల్ కు పంపించేందుకు శ్రీలంక ఇలాంటి కుట్రలకు తెరలేపిందని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… ఇవాల్టి మ్యాచ్ లో పాకిస్తాన్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించాలి. ఇవాల్టి మ్యాచ్ లో 148 పరుగులకే శ్రీలంకను కట్టడి చేయాలి. లేకపోతే పాకిస్తాన్ ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ 148 పరుగులకు కంటే తక్కువ శ్రీలంకను కట్టడి చేయగలిగితే.. పాకిస్తాన్ సెమీ ఫైనల్ లోకి ఎంట్రీ ఇస్తుంది.

Also Read: Rinku Singh’s father dies: రింకూ ఇంట విషాదం..టీమిండియా ప్లేయ‌ర్లకు అసలు సిగ్గుందా..రీల్స్ చేస్తూ చేస్తారా?

 

 

 

 

 

?utm_source=ig_web_copy_link

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×