E-Paper
Advertisement

Srisailam Jalaharathi: శ్రీశైలంలో మల్లన్న దర్శనం.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు

Srisailam Jalaharathi: శ్రీశైలంలో మల్లన్న దర్శనం.. జలహారతి ఇచ్చిన సీఎం చంద్రబాబు
Advertisement

CM Chandrababu Darshnam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శ్రీశైలం లోని మల్లన్నను దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనంతపురం జిల్లా వెళ్లారు. గుండుమల గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమం గురించి అడిగి తెలుసుకోనున్నారు.

అనంతపురం పర్యటనకు వెళ్లారు సీఎం చంద్రబాబు. ఉండవల్లిలోని గురువారం ఉదయం తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరారు. సంప్రదాయ దస్తులు ధరించిన సీఎం చంద్రబాబు తొలుత శ్రీశైలం వెళ్లారు. మార్గ మధ్యలో ఆగి, దేవాలయ అభివృద్ధి పనులు గురించి ఆరా తీశారు. ఆలయం వద్దకు చేరుకోగానే వేద పండితులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు.

Advertisement

ALSO READ: జగన్‌ని వెంటాడుతున్న భయం, ఈసారి..

అక్కడి నుంచి నేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేశారు. ఆ తర్వాత స్థానిక టీడీపీ నేతలతో కాసేపు మాట్లాడారు సీఎం చంద్రబాబు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలహారతి ఇచ్చారు. అక్కడి నుంచి నేరుగా హెలికాఫ్టర్‌‌‌‌‌‌లో అనంతపురానికి చేరుకున్నారు.

Advertisement

మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీని పర్యవేక్షించనున్నారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ నేతలతో సమావేశం అవుతారు. పార్టీ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నేరుగా విజయవాడకు చేరుకుంటారు సీఎం చంద్రబాబునాయుడు.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×