E-Paper
Advertisement

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?
Advertisement

Amaravati: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఏపీ రాజకీయ నేతలు దీపావళి వేళ కాస్త రిలాక్స్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ సోమవారం రాత్రి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు నేతలు వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఘనంగా దీపావళి సంబరాలు

Advertisement

ఏపీ రాజకీయాల్లో వారిద్దరు కీలకమైన నేతలు. ఒకరు సీఎం చంద్రబాబు కాగా, మరొకరు మాజీ సీఎం జగన్. సోమవారం రాత్రి ఇరు కుటుంబాలు వేర్వేరు ప్రాంతాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో భార్య భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

సీఎం దంపతులు బాణాసంచా కాల్చిన ఫొటోలను టీడీపీ అధికారికంగా విడుదల చేసింది. చంద్రబాబు, భువనేశ్వరి పక్క పక్కనే నిలబడి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు వెలిగిస్తూ కనిపించారు.అటు వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోని యలహంక నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సోమవారం ఉదయం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.

Advertisement

సీఎం చంద్రబాబు.. జగన్ దంపతులతో కలిసి

దీపావళి వేడుకల్లో భార్య భారతితో కలిసి పాల్గొన్నారు మాజీ సీఎం. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చారు మాజీ సీఎం జగన్ దంపతులు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎక్స్‌ ద్వారా తెలియజేశారు మాజీ సీఎం జగన్.

ALSO READ:  నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..  ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

ఇదిలా ఉండగా జగన్ సడన్‌గా లండన్ నుంచి రావడంపై పార్టీ నేతలు అప్పుడు చర్చించుకోవడం మొదలుపెట్టారు.  షెడ్యూల్ ప్రకారం ఈనెల 23 వరకు జగన్ దంపతులు లండన్‌లో గడపాల్సి ఉంది.  రెండురోజులు ముందుగానే వచ్చేశారని అంటున్నారు. రీసెంట్‌గా జగన్ తన ఫోన్ నెంబర్లు ఇవ్వలేదని సీబీఐ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో అధినేత వచ్చారని అంటున్నారు కొందరు నేతలు. జగన్ విదేశీ పర్యటన పూర్తి కావడంతో నేరుగా ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరుకావాల్సివుంది.  మరి ఇప్పుడైనా న్యాయస్థానం ముందు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×