E-Paper
Advertisement

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?

Amaravati: సీఎం చంద్రబాబు-జగన్ ఫ్యామిలీల దీపావళి సంబరాలు, మేటరేంటి?
Advertisement

Amaravati: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే ఏపీ రాజకీయ నేతలు దీపావళి వేళ కాస్త రిలాక్స్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ సోమవారం రాత్రి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు నేతలు వేడుకలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.

ఘనంగా దీపావళి సంబరాలు

Advertisement

ఏపీ రాజకీయాల్లో వారిద్దరు కీలకమైన నేతలు. ఒకరు సీఎం చంద్రబాబు కాగా, మరొకరు మాజీ సీఎం జగన్. సోమవారం రాత్రి ఇరు కుటుంబాలు వేర్వేరు ప్రాంతాల్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసంలో భార్య భువనేశ్వరితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

సీఎం దంపతులు బాణాసంచా కాల్చిన ఫొటోలను టీడీపీ అధికారికంగా విడుదల చేసింది. చంద్రబాబు, భువనేశ్వరి పక్క పక్కనే నిలబడి చిచ్చుబుడ్లు, కాకరపువ్వొత్తులు వెలిగిస్తూ కనిపించారు.అటు వైసీపీ అధినేత జగన్ బెంగళూరులోని యలహంక నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. సోమవారం ఉదయం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు.

Advertisement

సీఎం చంద్రబాబు.. జగన్ దంపతులతో కలిసి

దీపావళి వేడుకల్లో భార్య భారతితో కలిసి పాల్గొన్నారు మాజీ సీఎం. దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చారు మాజీ సీఎం జగన్ దంపతులు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో మరిన్ని వెలుగులు తీసుకురావాలని కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు ఎక్స్‌ ద్వారా తెలియజేశారు మాజీ సీఎం జగన్.

ALSO READ:  నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..  ఏడు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్

ఇదిలా ఉండగా జగన్ సడన్‌గా లండన్ నుంచి రావడంపై పార్టీ నేతలు అప్పుడు చర్చించుకోవడం మొదలుపెట్టారు.  షెడ్యూల్ ప్రకారం ఈనెల 23 వరకు జగన్ దంపతులు లండన్‌లో గడపాల్సి ఉంది.  రెండురోజులు ముందుగానే వచ్చేశారని అంటున్నారు. రీసెంట్‌గా జగన్ తన ఫోన్ నెంబర్లు ఇవ్వలేదని సీబీఐ.. న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలో అధినేత వచ్చారని అంటున్నారు కొందరు నేతలు. జగన్ విదేశీ పర్యటన పూర్తి కావడంతో నేరుగా ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరుకావాల్సివుంది.  మరి ఇప్పుడైనా న్యాయస్థానం ముందు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×