E-Paper
Advertisement

Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ

Davos-2026: ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. అమరావతిలో ఏఐ వర్సిటీపై చర్చ
Advertisement

Davos-2026:  దావోస్ వేదికగా భారీ ఎత్తున పెట్టుబడులు రప్పించేందుకు చంద్రబాబు టీమ్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అంతేకాదు అమరావతిలో ఏఐ యూనివర్సిటీ గురించి చర్చ జరిగింది.

దావోస్ బిజీగా సీఎం చంద్రబాబు, పలు పారిశ్రామిక‌వేత్తలతో భేటీ

Advertisement

ఏపీకి కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా టెక్నాలజీ, విద్యపరంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. ఈ నేపథ్యంలో బుధవారం దావోస్ వేదికగా ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మెండ్ తో ఆయన సమావేశమయ్యారు. ఇరువురు కీలక అంశాలపై చర్చించారు.

ఏపీలో స్టార్టప్‌లను ప్రోత్సహించడంతోపాటు యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను అందించేందుకు సిద్ధమైంది ఆ సంస్థ. ఏఐ ఎకో సిస్టమ్‌ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వంతో కలిసి పని చేస్తామన్నారు కాలిస్టా. దేశంలోనే అమరావతిలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చ జరిగింది. ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని అనేదానిపై మాట్లాడారు.

Advertisement

ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ వైస్ ప్రెసిడెంట్‌తో ముఖ్యమంత్రి సమావేశం

దీనిపై ఇప్పటికే ఓ అవగాహన ఒప్పందంపై సంతకం కూడా చేశారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్, హార్డ్ వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వహించేందుకు ఎన్విడియా ఆసక్తి చూపింది. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న కంపెనీల్లో ఎన్విడియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

2026 ఏడాది నాటికి ఈ కంపెనీ విలువ 6 ట్రిలియన్లకు చేరుకుంటుందని టెక్ నిపుణుల అంచనా. ప్రపంచంలోని టెక్ కంపెనీలు ఏఐ చిప్స్ కోసం ఎన్విడియా వైపు చూస్తున్నాయి. అలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు రప్పిస్తే కేవలం విద్యకు మాత్రమే కాకుండా దాని ఆధారిత కంపెనీల రాక మరింత వేగవంతం అవుతుందని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది.

ALSO READ: దావోస్‌లో ఏపీ ఆరంభం అదుర్స్.. RMZ గ్రూప్ భారీపెట్టుబడి, ఫలించిన లోకేష్ కృషి

 

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×