E-Paper
Advertisement

Mega Parents-Teachers Meeting: ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు.. పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు

Mega Parents-Teachers Meeting: ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు.. పేరెంట్స్-టీచర్స్ మీటింగ్‌లో  సీఎం చంద్రబాబు
Advertisement

Mega Parents-Teachers Meeting: ప్రజలను ఆస్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. ప్రపంచంలో అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతోందన్నారు. భవిష్యత్తులో పిల్లలు ఎక్కువ ఉండే దేశం భారత్ అవుతుందన్నారు. పిల్లలకు తెలివితేటలు బాగా ఉన్నాయని, అన్ని సబ్జెక్టుల్లో బేసిక్ పట్టు సాధించేలా బలమై పునాది వేసే కార్యక్రమం ఇదేనని అన్నారు.

పార్వతీపురం జిల్లాలో పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

Advertisement

పిల్లల బలహీనతలు, బలాలు గుర్తించాలన్నారు. వినూత్న కార్యక్రమాలకు పిల్లలు ఎప్పుడూ ముందు ఉండాలన్నారు. పిల్లల ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయాలని, లోపం ఎక్కడుందో గమనించి వెంటనే సరిచేయాలన్నారు. చదువుతోపాటు ఆటలు, పాటలు కూడా ఉండాలన్నారు. తక్కువ సమయమైనా పిల్లలు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు.

నూతన బోధన విధానాలు తయారీ, టీచర్ల పనితీరును అభినందించారు సీఎం.  పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. మెగా పేరెంట్‌-టీచర్స్‌ సమావేశం శుక్రవారం ఉదయం భామినిలోని మోడల్ పాఠశాలలో జరిగింది. దీనికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. తరగతి గదులను పరిశీలించారు ముఖ్యమంత్రి.

Advertisement

చదువుతోపాటు ఆటలు ఉండాలి-సీఎం

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో మెగా పీటీఎం కార్యక్రమం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మోడల్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు.

పాఠశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు, నేరుగా విద్యార్థుల తరగతులను పరిశీలించారు.  విద్యార్థులతోపాటు క్లాస్ రూములో కాసేపు కూర్చొన్నారు. డిజిటల్ పాఠాలు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారనేది దగ్గరుండి  తెలుసుకున్నారు.  ఆ తర్వాత విద్యార్థులతో కూర్చుని వారితో ముచ్చటించారు.  వారి ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు.

ALSO READ: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్

ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలు తెలుగు చదివే విధానాన్ని దగ్గరుండి పరిశీలించారు.  విద్యార్థులు-పేరెంట్స్‌తో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శారద జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం సమావేశానికి హాజరయ్యారు.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×