E-Paper
Advertisement

Cm Chandrababu : ప్రాణాలతో చెలగాటమా ? రెడ్ కేటగిరీ ఇండస్ట్రీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..

Cm Chandrababu : ప్రాణాలతో చెలగాటమా ? రెడ్ కేటగిరీ ఇండస్ట్రీలకు సీఎం చంద్రబాబు వార్నింగ్..
Advertisement

CM Chandrababu Fires on Pharma Industries(Andhra news today) : విశాఖజిల్లా అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అంతకుముందు మృతుల కుటుంబాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం.. మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. ప్రమాదంలో మొత్తం 17 మంది మరణించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. వారందరికీ ఈరోజే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని వెల్లడించారు.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.25 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రమాదం జరిగిన కంపెనీ ఎసెన్షియా రెడ్ కేటగిరీలో ఉందని తెలిపారు. కంపెనీలు తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని పేర్కొన్నారు. పరిశ్రమలో పేపర్ క్రౌడ్ పేలుడు జరిగిందని వివరించారు. ఎస్ఓపీ సరిగ్గా పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు.

Advertisement

Also Read:  పంచాయతీల్లో మలిదశ విప్లవం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2019 నుంచి 2024 మధ్య రాష్ట్రంలో 119 అగ్నిప్రమాదాలు జరిగాయని, ఐదేళ్లకాలంలో రాష్ట్రంలో 120 మంది చనిపోయారని తెలిపారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం సంబంధిత కంపెనీలపై ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదన్నారు. రెడ్ కేటగిరీలో ఉన్న కంపెనీలు ఇప్పటికైనా కార్మికులకు సంబంధించిన తగు జాగ్రత్త చర్యలను పాటించాలని తెలిపారు. అందరు ఇండస్ట్రియలిస్టులందరూ సమావేశానికి హాజరు కావాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

ఈ సంఘటనను ఆధారంగా తీసుకుని.. ఇండస్ట్రీలో జరిగిన ప్రమాదంపై హైలెవల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీలో ఉండే అవకతవకల గురించి, నాణ్యతా ప్రమాణాలను అన్నింటినీ అధ్యయనం చేస్తారన్నారు. ప్రమాదానికి కారకులైన వారెవరైనా సరే వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. పరిశ్రమ యాజమాన్యంలో ఉన్న అంతర్గత సమస్యలు కూడా ప్రమాదానికి ఒక కారణమని భావిస్తున్నట్లు తెలిపారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×