E-Paper
Advertisement

Visakhapatnam: ఇండియాలో సేఫ్-క్లీన్ సిటీ, మహిళల భద్రతలో విశాఖ టాప్ ప్లేస్-సీఎం చంద్రబాబు

Visakhapatnam: ఇండియాలో సేఫ్-క్లీన్ సిటీ, మహిళల భద్రతలో విశాఖ టాప్ ప్లేస్-సీఎం చంద్రబాబు
Advertisement

Visakhapatnam: ఇండియాలోనే సేఫ్ అండ్ క్లీన్ సిటీ విశాఖపట్నం అని అన్నారు సీఎం చంద్రబాబు. మహిళల భద్రత విషయంలో ఈ నగరం అగ్రస్థానంలో ఉందన్నారు. రానున్న మూడు నాలుగేళ్లు గుగూల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని వివరించారు. గురువారం విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా-యూరప్ బిజినెస్ భేటీలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు.

మహిళల భద్రతలో విశాఖ టాప్ ప్లేస్ 

Advertisement

ఇండియా-ఐరోపా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని అన్నారు. రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో ఓ గిగావాట్ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుందన్నారు. సాంకేతిక రంగంలో తాము కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటున్నట్లు తెలిపారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో భారతీయులదే కీలకపాత్ర అని చెప్పుకొచ్చారు. డేటా సెంటర్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల వంటి రంగాల్లో ముందున్నామని వెల్లడించారు. త్వరలో అమరావతితో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అందుబాటులోకి రానుందని ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

ఇండియా-యూరప్ బిజినెస్ భేటీలో సీఎం చంద్రబాబు

పెట్టుబడులతో వచ్చేవారిని ఎలాంటి ఇబ్బందులు కావాల్సిన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. మౌలిక సదుపాయాల కల్పనలో తమ రాష్ట్రం ముందు ఉందన్నారు. గ్రీన్ ఎనర్జీ విభాగంలో పెట్టుబడులు వస్తున్నాయని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో పోర్టులతోపాటు రైల్వే అనుసంధానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

ALSO READ: ఏపీలో భారీ పెట్టుబడి.. గూగుల్ తర్వాత ఆ సంస్థదే

గ్రీన్‌ ఎనర్జీ సెక్టార్‌లో భారత్‌ 500 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. అందుకు అనుగుణంగా 160 గిగావాట్ల విద్యుదుత్పత్తికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సౌర-పవన-పంప్డ్‌ ఎనర్జీ రంగాల్లో బలంగా ఉన్నామని, ఏపీలో వివిధ రకాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీలో నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉందని, కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేయడంతో వారు ముందు ఉంటారని అన్నారు. పెట్టుబడి పెడితే అనుమతుల్లో ఎలాంటి జాప్యం ఉండదన్నారు. కేవలం 45 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

 

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×