E-Paper
Advertisement

CM Chandrababu: అప్పు అడిగితే.. పారిపోతున్నారు.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: అప్పు అడిగితే.. పారిపోతున్నారు.. సీఎం చంద్రబాబు

CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం అనారోగ్యమైందని సీఎం చంద్రబాబు అన్నారు. నీతి అయోగ్ నివేదికపై సీఎం చంద్రబాబు సోమవారం మాట్లాడారు. ఈ సంధర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీడియా ముందుంచారు. ఐదేళ్ల పాలనతో రాష్ట్రం నేడు ఎంతగానో కోల్పోయిందని సీఎం అన్నారు.

తాడేపల్లిలోని సచివాలయంలో సీఎం మాట్లాడుతూ.. నీతి అయోగ్ నివేదికలో రాష్ట్రానికి 17వ ర్యాంక్ వచ్చినట్లు సీఎం తెలిపారు. ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో ఏపీ చివరి స్థానంలో ఉందని, వృద్ది రేటు దారుణ పరిస్థితికి చేరిందన్నారు. నీతి అయోగ్ నివేదికలో ఏపీ పరిస్థితి మరింతగా దిగజారిందన్నారు. ఏపీలో వైసీపీ పాలన ఆర్థిక కష్టాలు మిగిల్చిందని, మొత్తం డబ్బులను ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. అన్ని ఆస్తులను తాకట్టు పెట్టారని, చివరకు ఎమ్మార్వో ఆఫీసులను కూడ తాకట్టు పెట్టినట్లు సీఎం అన్నారు.

శరీరానికి ఆరోగ్యం ఎలా అవసరమో, అలాగే ఒక రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మెరుగు అవసరమన్నారు. రాష్ట్రం నాశనమైందని చెప్పేందుకు నీతి అయోగ్ రిపోర్ట్ నిదర్శనమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి గల సమస్యలు చాలానే ఉన్నాయని, వాటిని పరిష్కరించకుండ గత ప్రభుత్వం ఏం చేసిందో అర్థం కావడం లేదన్నారు. ఏదైనా రాష్ట్రం ఎలా ఉందో తెలుసుకొనేందుకు, ఆర్థిక పరిస్థితిని బట్టి చెప్పవచ్చన్నారు. రాష్ట్రం బాగుపడాలంటే సంపద సృష్టించాల్సిన అవసరం ఉందని, అలాగే ఓ వైపు జీతాలు చెల్లిస్తూ అభివృద్ది పథంలో నడిపించాల్సిన భాద్యత తమపై ఉందని చంద్రబాబు అన్నారు.

బాగున్న రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టారని, ఇప్పుడు మన రాష్ట్రానికి అప్పులు ఇచ్చే పరిస్థితి కూడ ఇప్పుడు లేదన్నారు. జిఎన్డీపి 33 పెరిగిందని, అప్పులు తెస్తే, మళ్లీ చెల్లించే సత్తా ఏపీకి లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని లేదని, అలాగే పోలవరం కూడ పూర్తి చేయలేదని, మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర వృద్ది రేటు పూర్తిగా పడిపోయిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే బాధేస్తుందని అన్నారు.

రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు, అలాగే మహిళలకు దీపం పథకం 2.o ద్వార ఏడాదికి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. అంతేకాకుండ దేశంలో ఎక్కడ లేని విధంగా పింఛన్ నగదును పెంచామని, ప్రతి నెలా ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నట్లు సీఎం అన్నారు. వైసీపీ చేసిన అప్పుల పుణ్యమా అంటూ మళ్లీ అప్పు తెచ్చే పరిస్థితి లేదన్నారు.

Also Read: Ayyannapatrudu on Nara Lokesh: లోకేష్ కు డిప్యూటీ.. అయ్యన్న లాజిక్ రిప్లై ఇదే!

అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని, త్వరలో మెగా డీఎస్సీ కూడ నిర్వహిస్తున్నట్లు సీఎం పునరుద్ఘాటించారు. త్వరలో పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, 10 లక్షల కోట్లు పెట్టుబడులతో రాష్ట్రంలోని యువతకు ఉపాధి కలుగుతుందన్నారు. తాను ఊహించని రీతిలో రాష్ట్రానికి డ్యామేజ్ చేసిన ఘనత మాజీ సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. జీవోలు కూడ బయటకు రాకుండ పాలన చేశారని, ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చాక, లెక్కలు చూసి షాక్ కు గురైనట్లు సీఎం అన్నారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×