E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక.. అయోధ్యకు సీఎం చంద్రబాబు, ఆ తర్వాత విదేశీ టూర్

CM Chandrababu: ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక.. అయోధ్యకు సీఎం చంద్రబాబు, ఆ తర్వాత విదేశీ టూర్
Advertisement

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం అయోధ్యకు వెళ్తున్నారు. శ్రీరామ జన్మభూమిలో కొలువుదీరిన రాముడ్ని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎంవో కార్యాలయం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య చేరుకుంటారు.

అయోధ్యకు సీఎం చంద్రబాబు

Advertisement

అక్కడి నుంచి నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌కు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే గడపనున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో ఉండనున్నారు. శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

దర్శనం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు అయోధ్య నుంచి నేరుగా విజయవాడకు చేరుకుంటారు.  అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి సమాచారం తీసుకోనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

రాముడి సన్నిధిలో మూడు గంటలపాటు

ఇదిలావుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ విదేశీ పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 30న ఆయన బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాల మాట.  తిరిగి జనవరి నాలుగున విజయవాడకు చేరుకుంటారు. వ్యక్తిగత పర్యటన కోసం సీఎం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై స్పష్టత రావాల్సివుంది.

ALSO READ:  ఆగిన గుండె.. శవరాజకీయాలకు తెరలేసిన వైసీపీ

ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. సీఎం నేతృత్వంలోని కమిటీ.. చీఫ్ కమిషనర్, నలుగురు కమిషన్ల ఎంపిక పూర్తి చేసింది. చీఫ్ కమిషనర్‌గా హైకోర్టు న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు పేరు ఖరారు అయ్యింది. నలుగురు కమిషనర్ల నియామకాలను ఓకే చేసింది.

మాజీ జర్నలిస్టు వీఎస్‌కే చక్రవర్తిని కమిషనర్‌గా ఖరారు చేసింది ప్రభుత్వం. ఆయనతోపాటు మరో ముగ్గురు కమిషనర్లుగా ఉన్నారు. ఆ ముగ్గురు న్యాయవాదులను ఎంపిక చేసింది. కడపకు చెందిన రవియాదవ్‌, అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న, విశాఖకు చెందిన పీఎస్‌ నాయుడుల పేర్లు ఓకే అయ్యాయి. ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ జీఏడీ వద్ద ఉంది. జీఏడీ నుంచి గవర్నర్‌కు ఫైలు వెళ్లిన తర్వాత ఆమోదముద్ర పడనుంది. ఆ తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×