E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక.. అయోధ్యకు సీఎం చంద్రబాబు, ఆ తర్వాత విదేశీ టూర్

CM Chandrababu: ఏపీలో ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక.. అయోధ్యకు సీఎం చంద్రబాబు, ఆ తర్వాత విదేశీ టూర్

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆదివారం అయోధ్యకు వెళ్తున్నారు. శ్రీరామ జన్మభూమిలో కొలువుదీరిన రాముడ్ని దర్శించుకోనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి సీఎంవో కార్యాలయం అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య చేరుకుంటారు.

అయోధ్యకు సీఎం చంద్రబాబు

అక్కడి నుంచి నేరుగా శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌కు వెళ్లనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు అక్కడే గడపనున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో ఉండనున్నారు. శ్రీరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.

దర్శనం తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు అయోధ్య నుంచి నేరుగా విజయవాడకు చేరుకుంటారు.  అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి అధికారుల నుంచి సమాచారం తీసుకోనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

రాముడి సన్నిధిలో మూడు గంటలపాటు

ఇదిలావుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్యామిలీ విదేశీ పర్యటనకు వెళ్లనుంది. డిసెంబర్ 30న ఆయన బయలుదేరనున్నట్లు పార్టీ వర్గాల మాట.  తిరిగి జనవరి నాలుగున విజయవాడకు చేరుకుంటారు. వ్యక్తిగత పర్యటన కోసం సీఎం చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కడికి వెళ్తున్నారు అనే దానిపై స్పష్టత రావాల్సివుంది.

ALSO READ:  ఆగిన గుండె.. శవరాజకీయాలకు తెరలేసిన వైసీపీ

ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామక ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చింది. సీఎం నేతృత్వంలోని కమిటీ.. చీఫ్ కమిషనర్, నలుగురు కమిషన్ల ఎంపిక పూర్తి చేసింది. చీఫ్ కమిషనర్‌గా హైకోర్టు న్యాయవాది వజ్జా శ్రీనివాసరావు పేరు ఖరారు అయ్యింది. నలుగురు కమిషనర్ల నియామకాలను ఓకే చేసింది.

మాజీ జర్నలిస్టు వీఎస్‌కే చక్రవర్తిని కమిషనర్‌గా ఖరారు చేసింది ప్రభుత్వం. ఆయనతోపాటు మరో ముగ్గురు కమిషనర్లుగా ఉన్నారు. ఆ ముగ్గురు న్యాయవాదులను ఎంపిక చేసింది. కడపకు చెందిన రవియాదవ్‌, అనంతపురానికి చెందిన గాజుల ఆదెన్న, విశాఖకు చెందిన పీఎస్‌ నాయుడుల పేర్లు ఓకే అయ్యాయి. ఈ నియామకాలకు సంబంధించిన ప్రక్రియ జీఏడీ వద్ద ఉంది. జీఏడీ నుంచి గవర్నర్‌కు ఫైలు వెళ్లిన తర్వాత ఆమోదముద్ర పడనుంది. ఆ తర్వాత ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×