E-Paper
Advertisement

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?

Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ కి ఆటంకం.. విమానంలో లోపం.. అదేనా ప్రాబ్లమ్?
Advertisement

Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ బయలు దేరారు. తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం వెళ్లారు. సాయంత్రం 5:03 కి విమానం ఎక్కారు. ఫ్లైట్ టేకాఫ్ అయింది. సీఎంకు సెండాఫ్ పలికిన అధికారులు రిటర్న్ అయ్యారు. కట్ చేస్తే…

ఢిల్లీ వెళ్లాల్సిన ఆ విమానం తిరిగి 5:26 కల్లా మళ్లీ గన్నవరం విమానాశ్రయంలోనే ల్యాండైంది. ఈసారి ఎమెర్జెన్సీ ల్యాండ్. విషయం తెలిసి అంతా హడలిపోయారు.

Advertisement

విమానంలో సీఎం జగన్ తో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిలు ఉన్నారు.

ఫ్లైట్ గన్నవరం నుంచి బయలు దేరాక.. విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్టు గుర్తించారు పైలైట్. వెంటనే రిటర్న్ తీసుకుని.. గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రమాదం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

విమానంలో లోపం ఇప్పటికిప్పుడు సరిదిద్దే సమస్య కాకపోవడంతో తాడేపల్లికి తిరిగి వెళ్లిపోయారు సీఎం జగన్. సోమవారం నాటి ఢిల్లీ టూర్ రద్దు చేసుకున్నారు. మంగళవారం ఉదయం మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు.

సీఎం జగన్ ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తడాన్ని సెక్యూరిటీ వింగ్ సీరియస్ గా తీసుకుంది. వెంటనే విచారణకు ఆదేశించింది. విమానంలో ఏసీ పని చేయట్లేదని తెలుస్తోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×