BigTV English

Jagan : ఆ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. ఎందుకంటే..?

Jagan : ఆ ముఖ్యనేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ.. ఎందుకంటే..?

Jagan : వివేకానందరెడ్డి హత్యకేసు ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


వాస్తవంగా సోమవారం సీఎం అనంతపురం జిల్లాలో పర్యటించారు. నార్పలలో వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనాలి. అయితే ఆదివారం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ తర్వాత సీఎం పర్యటన వాయిదా పడింది. అప్పటి నుంచే వివేకా హత్యకేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయనే అనుమానాలు బలపడ్డాయి. మరోవైపు సీఎం జగన్ అధికారిక సమీక్షలు రద్దు చేసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతో అత్యవసరంగా భేటీకావడం చర్చనీయాంశంగా మారింది.

సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు అవినాష్‌ రెడ్డి.. పులివెందుల నుంచి హైదరాబాద్‌ బయల్దేరినపుడు ఆయనతోపాటు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుపై అవినాష్‌తో చర్చించిన అంశాలను సీఎం జగన్‌కు చెవిరెడ్డి వివరించారని సమాచారం. ఎంపీ అవినాష్‌ రెడ్డి విషయంలో జరిగే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? పార్టీ తరఫున ఎలా ముందుకెళ్లాలి? తదితర అంశాలపై నేతలతో జగన్‌ చర్చించినట్లు తెలుస్తోంది.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×