BigTV English

Avinash Reddy : హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ అదేనా..?

Avinash Reddy : హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. సీబీఐ నెక్ట్స్ స్టెప్ అదేనా..?

Avinash Reddy : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు విచారణ చేపట్టనుంది.


అవినాష్‌ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌లో కీలక అంశాలు ప్రస్తావించారు. వివేకా కుమార్తె సునీత స్థానిక ఎమ్మెల్సీ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు, సీబీఐ ఆఫీసర్‌తో కుమ్మకయ్యారని ఆరోపించారు. ఈ కేసులో కుట్ర పన్ని తనను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలి కోరారు. దస్తగిరిని ఢిల్లీకి పిలిచి చాలా రోజులు సీబీఐ తన వద్ద ఉంచుకుందని తెలిపారు. అక్కడే దస్తగిరిని అప్రూవర్‌గా మార్చారని ఆరోపించారు. 2021లో సీబీఐ ఛార్జ్‌షీట్‌లో తనను అనుమానితుడిగా చేర్చిందని గుర్తు చేశారు. తనపై నేరం రుజువు చేయడానికి సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

సునీత, వివేకా రెండో భార్యకు మధ్య విభేదాలు ఉన్నాయని అవినాష్ రెడ్డి.. తన పిటిషన్ లో పేర్కొన్నారు. రెండో భార్య కుమారుడికి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో సీటు ఇప్పిస్తామని వివేకా హామీ ఇచ్చారని .. అక్కడే విల్లా కొనుగోలు చేసేందుకు ప్లాన్‌ చేశారని తెలిపారు. రెండో భార్య కుటుంబానికి డబ్బును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే ప్లాన్‌ తెలిసి వివేకాతో సునీత గొడవ పడ్డారని ఆరోపించారు.


వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని సహనిందితుడిగా చేర్చి విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన పులివెందుల నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు ఈ కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ అనుచరుడు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కస్టడీ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది.

Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×