E-Paper
Advertisement

CM Jagan Met I-Pac Team: ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం షాకవ్వడం ఖాయం: సీఎం జగన్

CM Jagan Met I-Pac Team: ఏపీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం షాకవ్వడం ఖాయం: సీఎం జగన్
Advertisement

Jagan Meets I-Pac Team: ఏపీలో ఎన్నికల రణరంగం ముగిసింది. హోరాహోరీ పోటీలో నెగ్గేదెవరో.. వెనుదిరిగేదెవరో జూన్ 4న తేలిపోనుంది. ఫలితాలకు ఇంకా రెండు వారాలకు పైగానే సమయం ఉంది. కాగా.. ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐ ప్యాక్ టీమ్ ను సీఎం జగన్ మోహన్ రెడ్డి గురువారం కలిశారు. టీమ్ సభ్యులతో మాట్లాడిన ఆయన.. ఏపీ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు.

వైసీపీ విజయానికి కృషి చేసిన ఐప్యాక్ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయేది మళ్లీ వైసీపీ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. జూన్ 4న వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాలను చూసి దేశమంతా షాకవుతుందన్నారు. 2019లో వచ్చినదానికంటే అత్యధిక సీట్లు, అత్యధిక మెజార్టీ వస్తుందని పేర్కొన్నారు. ఏపీ ఫలితాలను ప్రశాంత్ కిషోర్ కూడా ఊహించరని, ఆయన ఊహకు మించిన సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఎన్నికల్లో మొత్తం 22 ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనన్న జగన్.. ఈసారి గతంలోకంటే మరింత మెరుగైన పాలనను అందిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు మరింత మేలు చేస్తామని, మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. వైసీపీ గెలుపు తథ్యమని, భవిష్యత్ లో మరోసారి ఐప్యాక్ టీమ్ తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

Also Read: అందుకేనా.. ఐ’ప్యాక్’ ఆఫీసుకు సీఎం జగన్

Advertisement

2019లో 151 సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలిచిన తాము.. ఈసారి అంతకుమించిన సీట్లలో విజయం సాధిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత యావత్ దేశం ఏపీవైపే చూస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఐప్యాక్ తో వైసీపీ జర్నీ ఇలాగే కొనసాగుతుందన్నారు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×