BigTV English
Advertisement

Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసా..?

Tirumala : తిరుమల భక్తజనసంద్రంగా మారిపోయింది. కొండపై ఎటువైపు చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు. వరుస సెలవులతో తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టమెంట్‌లు నిండిపోయాయి. ఔటర్‌ రింగ్‌రోడ్డు, శిలా తోరణం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి.


మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనంతోపాటు భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆహారం, పాలు తాగునీరును టీటీడీ అందిస్తోంది. శ్రీవారి సేవకులు, ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాలు భక్తులకు సేవలందిస్తున్నాయి.

వెంగమాంబ అన్నప్రసాద సముదాయంలో శనివారం మధ్యాహ్నం 79 వేల మందికి అన్నప్రసాదం అందించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ క్యూలైన్లలో 80 వేల మందికి పంపిణీ చేశారు. సాధారణం కంటే రెట్టింపుగా అన్నప్రసాదాలు అందించారు. పిల్లలకు ఎప్పటికప్పుడు పాలు అందించారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 50 వేల మంది యాత్రికులు శ్రీవారిని దర్శించుకున్నారు.


భక్తుల రద్దీ కారణంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు, దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలు, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఉదయం వరకు తిరుమలలో రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×