BigTV English
Advertisement

Daggubati with Chandrababu: మూడు దశాబ్దాల తర్వాత.. చంద్రబాబుతో దగ్గుబాటి భేటీ, ఏం జరిగింది?

Daggubati with Chandrababu: మూడు దశాబ్దాల తర్వాత.. చంద్రబాబుతో దగ్గుబాటి భేటీ, ఏం జరిగింది?

Daggubati with Chandrababu:  రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడు అనుకోని వ్యక్తులు సమావేశం కావడం సహజం. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అదే జరిగింది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత సీఎం చంద్రబాబుతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు భేటీ అయ్యారు. ఇరువురు మధ్య ప్రస్తుతం రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.


ఆదివారం రాత్రి అమరావతి వచ్చారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఇరువురు తోడల్లుళ్ళు కావడంతో కాసేపు రాజకీయాలను పక్కన పెట్టేశారు. వివిధ అంశాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. తాను రచించిన‘ఆది నుంచి నేటి వరకు’పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

మార్చి ఆరున విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.


గతంలో వీరిద్దరు కుటుంబ కార్యక్రమాల్లో కలుసుకున్నారు. కాకపోతే చంద్రబాబు నివాసానికి దగ్గుబాటి రావడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో రాజకీయంగా ఏమైనా చర్చలు జరిగాయంటూ చర్చించుకోవడం మిగత పార్టీల వంతైంది.

ALSO READ: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం

చంద్రబాబు-దగ్గుబాటి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇరువురు తోడల్లుళ్లు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు ఒకరు లెప్ట్.. మరొకరు రైట్‌గా ఉండేవారు.  వివిధ సంఘాలను చంద్రబాబు చూసేవారు. అభ్యర్థుల ఎంపికను దగ్గుబాటికి అప్పగించారు. ఆనాడు దగ్గుబాటి ఎంపిక చేసిన నేతలు ఇప్పుడు వివిధ పార్టీల్లో నేతలుగా రాణిస్తున్నారు కూడా.

ఆనాడు టీడీపీ క్రైసిస్‌ను ఇరువురు నేతలు తమ భుజాలపై మోశారు. పార్టీని గట్టెక్కించారు. ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడుగా చంద్రబాబు పగ్గాలు చేపట్టారు. రాజకీయాలకు దూరమయ్యారు దగ్గుబాటి. అయితే వైఎస్ హయాంలో కాంగ్రెస్‌లోకి వచ్చిన ఆయన, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లినప్పటికీ ఎక్కువ రోజులు అక్కడ ఉండలేదు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చాన్నాళ్ల తర్వాత చంద్రబాబు ఇంటికి దగ్గుబాటి రావడంతో తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా కనిపించారు. చాన్నాళ్లు తర్వాత ఈ కలయిక చూశామని కొందరు సీనియర్లు చెబుతున్నారు.

 

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×