BigTV English
Advertisement

Deputy CM Narayana Swamy Comments: డిప్యూటీ సీఎం మాట.. పోలీసులు పట్టించుకోవట్లేదట..

Deputy CM Narayana Swamy Comments: డిప్యూటీ సీఎం మాట.. పోలీసులు పట్టించుకోవట్లేదట..

Deputy CM Narayana Swamy Hot Comments on Police: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ‌స్వామి గురించి అందరికీ తెలుసు. మనసులోని ఏమీ ఉంచుకోరు. ఏది అనుకుంటే అది బయటకు చెప్పడం ఆయన నైజం. సొంతపార్టీ అయినా, విపక్ష టీడీపీ అయినా ఆయనేం పట్టించుకోరు.


ఎన్నికల పోలింగ్ తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు ఒకొక్కరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు తున్నారు. టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కు అయిపోయారని ఆరోపించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా అదే పంథాను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా నారాయణ స్వామి తన ఆవేదనను మీడియా ముందు వెళ్లగక్కారు.

తన మాటలు పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు డిప్యూటీ సీఎం. ఎస్పీ, డీఎస్పీలు చంద్రబాబుకు తొత్తుగా మారారన్నది ఆయన ఆరోపణ. మరి ఐదేళ్లు అధికారంలో ఉన్నది ఆ పార్టీ. అప్పుడు పనిచేసిన పోలీసులే, ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఎన్నికల సంఘం కొందరు అధికారులను ట్రాన్స్‌ఫర్ చేసింది. లోకల్‌లో ఉన్నది అప్పుడున్న పోలీసులే. మరి ఆయన ఆవేదన ఏంటోనని తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు.


Also Read: Perni Nani Comments: పక్కా ప్లాన్ ప్రకారమే దారుణాలకు పాల్పడ్డారు: పేర్ని నాని

తమకు పోలీసుల రక్షణ అవసరం లేదని, తన శక్తి ఉన్నంతవరకు తమ జాతిని తామే కాపాడుకుంటామని చివరలో వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఇంతకీ ఆయనకు వచ్చిన కష్టం ఏంటో చెప్పలేదు. టీడీపీ ప్రభుత్వంలో ముద్రగడ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు నారాయణ స్వామి వంతైంది. అన్నట్లు ఈసారి ఎన్నికల్లో వైసీపీ పార్టీ నారాయణస్వామికి టికెట్ ఇవ్వలేదు. స్వామికి బదులుగా ఆయన కూతుర్ని రంగంలోకి దించింది.

Tags

Related News

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Big Stories

×