E-Paper
Advertisement

Threat to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బెదిరింపులు.. నేరుగా చంపేస్తామంటూ ఫోన్ కాల్స్..

Threat to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు బెదిరింపులు.. నేరుగా చంపేస్తామంటూ ఫోన్ కాల్స్..
Advertisement

Threat to Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడంతో, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏకంగా పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ అగంతకుడు ఫోన్ చేయగా, పోలీసుల దృష్టికి అధికారులు తీసుకెళ్లారు.

ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించారు. ఆ పర్యటనలో అక్రమ రేషన్ దందాను వెలుగులోకి తెచ్చారు పవన్. కాకినాడ పోర్టుకు పర్యటన ఖరారు కాగానే, అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అప్పటివరకు కాకినాడ పోర్టు వ్యవహారం అంతగా వెలుగులోకి రానప్పటికీ, పవన్ పర్యటనతో కేంద్రం సైతం పోర్టుపై ప్రత్యేక నిఘా ఉంచింది. కాకినాడ పోర్టు వ్యవహారం పలు మలుపులు తిరుగుతూ, నిరంతరం వార్తలో నిలుస్తోంది. మొత్తం మీద కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న అక్రమ దందాను పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకురావడంతో సంచలనంగా మారింది.

Advertisement

Also Read: Vikarabad District Crime: పెళ్ళాం ఊరెళ్లిందని.. ఓ భర్త చేసిన నిర్వాకం.. ఏకంగా కన్న కొడుకుపైనే..

తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా పవన్ కళ్యాణ్ ను చంపేస్తామని హెచ్చరిస్తూ అగంతకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. అలాగే అసభ్య పదజాలంతో మెసేజ్ లు కూడా రావడంతో, డిప్యూటీ సీఎం పేషీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని ముందుగా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు, అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? బెదిరింపుల వెనుక కాకినాడ పోర్టు వ్యవహారం ఉందా? లేక ఆకతాయి పనా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కు భద్రత మరింత పట్టిష్టం చేయాలని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

Related News

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

Big Stories

Advertisement
×