BigTV English
Advertisement

Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్యకు డిప్యూటీ సీఎం పవన్, ఎంపీడీవోకు పరామర్శ, నిందితుడు అరెస్ట్

Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్యకు డిప్యూటీ సీఎం పవన్, ఎంపీడీవోకు పరామర్శ, నిందితుడు అరెస్ట్

Pawan Kalyan Kadapa Tour: అన్నమయ్య జిల్లాలో దాడి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎంపీడీవో దాడి చేసినవారిని వదిలేది లేదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబును పరామర్శించనున్నారు.


శనివారం ఉమ్మడి కడప జిల్లాకు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వైసీపీ నాయకుల దాడిలో గాయపడి కడప రిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించ నున్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడిన వైసీపీ నేత సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు గాలివీడు ఎంపీడీఓ జవహర్‌బాబుపై దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఎంపీడీఓకు తీవ్రగాయాలు అయ్యాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రియాక్ట్ అయ్యారు. విధి నిర్వహణలోఉన్న అధికారులపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్యగా వర్ణించారు. ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదన్నారు. దాడి ఘటన గురించి అధికారులతో చర్చించారు డిప్యూటీ సీఎం.


ఘటనకు కారకులైన నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం. ఎంపీడీఓకు ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు డిప్యూటీ సీఎం. వారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం గౌరవం లేదన్నారు.

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వనున్నారు డిప్యూటీ సీఎం. ఇదిలావుండగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి చేసిన సుదర్శన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ALSO READ: జ‌గ‌న్‌ను బిగ్ షాక్.. మ‌రో నేత రాజీనామా

మరోవైపు డిప్యూటీ టూర్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గాలివీడు కార్యక్రమం రద్దు అయినట్టు తెలుస్తోంది. నేరుగా కడప రిమ్స్‌కు వెళ్లి ఎంపీడీఓను పరామర్శించి, అక్కడి నుంచి కమలాపురం వెళ్లనున్నారు. వల్లూరు మండలంలోని పైడి కాలువ ఇసుక రీ‌లను పరిశీలించనున్నట్లు సమాచారం.

డిప్యూటీ సీఎం పవన్ టూర్‌ను వైసీపీ నేతలు రాజకీయ కోణంలో చూస్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఫ్యాన్స్ పార్టీకి చెందిన దిగువశ్రేణి నాయకత్వం ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో దాడులకు దిగుతున్నారు. దీన్ని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి కడప జనసేన జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×