E-Paper
Advertisement

RRR Vs Jagan: పులివెందులకు బై ఎలక్షన్.. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆసక్తికర వ్యాఖ్యలు

RRR Vs Jagan: పులివెందులకు బై ఎలక్షన్.. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

RRR Vs Jagan: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక రానుందా? డిప్యూటీ సీఎం రఘురామరాజు ఎందుకు అలా అన్నారు? జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పరుగు పొగొట్టుకున్న వైసీపీ, మళ్లీ ఆ ఛాన్స్ అధికార పార్టీకి ఇస్తుందా? ఇంతకీ జగన్ మదిలో ఏముంది? ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు? ఇవే ప్రశ్నలు ఆ పార్టీ నేతలను వెంటాడుతున్నాయి.

సెప్టెంబర్ మూడో వారం నుంచి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారు. దాదాపు రెండువారాల పాటు సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మరి ఈసారైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా? డుమ్మా కొట్టబోతున్నారా? అదే జరిగితే ఉప ఎన్నికలు రావడం ఖాయమని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం రఘురామకృష్ణంరాజు.

Advertisement

మాజీ సీఎం జగన్ ఎమ్మెల్యే సభ్యత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులకు బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరిస్తే ఎమ్మెల్యే పదవికి జగన్ అర్హత లేదని భావించా లన్నారు. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా సెలవు కోరకుండా రెండు నెలలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే వారిపై అనర్హత పడుతుందన్నారు. తాజాగా ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్‌ని అసెంబ్లీకి రప్పించడానికి డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలని అంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు.

Advertisement

ALSO READ: ఇక అంబటి రాంబాబు వంతు.. ఆ 10 కోట్లపై ఆరా

ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అధికారికంగా సెలవు కోరకుండా రెండు నెలలు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైతే వారిపై అనర్హత పడుతుందన్నారు. తాజాగా ఇప్పుడు అదే వ్యాఖ్యలు చేశారు. కేవలం జగన్‌ని అసెంబ్లీకి రప్పించడానికి డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలని అంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు.

ఈ పరిస్థితిలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఏ విధంగా అడుగులు వేస్తారో? ఎందుకంటే ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మాజీ సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

అన్నట్లు మూడు రోజుల కిందట అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ వ్యవహారంపై నోరు విప్పారు. వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. స్పీకర్‌గా ఎమ్మెల్యేలు అందరికీ సమాన అవకాశం కల్పిస్తానని చెప్పకనే చెప్పారు.

ఇటీవల సీఎం చంద్రబాబు కూడా దీనిపై వ్యాఖ్యలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ ఛాలెంజ్ విసిరారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారని, ప్రజలు తిరస్కరించినప్పుడు తామేమీ చేయలేమన్నారు. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×