E-Paper
Advertisement

Alert for Tirumala Devotees : తిరుమలకు వెళ్లే వారికి గమనిక.. మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి..

Alert for Tirumala Devotees : తిరుమలకు వెళ్లే వారికి గమనిక.. మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతి..
Advertisement

Alert for Tirumala Devotees : తిరుమలలో ఉన్న భక్తులకు గుడ్ న్యూస్. నేడు కుమారధార తీర్థ ముక్కోటి కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. భద్రతా ఏర్పాట్లపై టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీస్ అధికారులు తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం 5.30 గంటల నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు.

Advertisement

కానీ.. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్య దృష్ట్యా.. అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించారు. ఇక అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుంచీ భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు వీలుగా అంబులెన్సులు, వైద్యులు, పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.

Read More : నేడే టీడీపీ-జనసేన తొలి జాబితా ప్రకటన..

Advertisement

టిటిడి ఉద్యోగులందరికీ మంచి చేయాలన్నదే తన తపన అని టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టిటిడి రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో భూమన కరుణాకరరెడ్డి కృతజ్ఞతా సభ, ఆత్మీయ సన్మాన కార్యక్రమం తిరుపతిలోని పరిపాలన భవనంలో ఉన్న పరేడ్ మైదానంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవారికి సహాయం చేయాలని చిన్నతనంలో తెలుగు మాస్టార్ చెప్పిన మాటలు తన మనసులో ఉండిపోయాయని, అప్పటి నుంచి అదే ఆలోచనగా జీవిస్తున్నానన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ తనకు తొలిసారి టిటిడి చైర్మన్ పదవిని ఇచ్చాక.. పేదవారికి సహాయం చేయాలన్న తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం లభించిందన్నారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×