E-Paper
Advertisement

PV Sindhu: ఆ భూమిని సింధుకు ఇవ్వొద్దు, కాలేజీ కట్టండి.. స్థానికుల డిమాండ్

PV Sindhu: ఆ భూమిని సింధుకు ఇవ్వొద్దు, కాలేజీ కట్టండి.. స్థానికుల డిమాండ్
Advertisement

⦿ 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం
⦿ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు కేటాయింపులు
⦿ స్థలం ఇవ్వొద్దని ఆందోళనకు దిగిన స్థానికులు
⦿ జూనియర్ కాలేజీ నిర్మించాలని నిరసన

విశాఖపట్నం, స్వేచ్ఛ: PV Sindhu: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు వైసీపీ హయాంలో కేటాయించిన రెండు ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఆ స్థలం ఆమెకు ఇవ్వొద్దని, అక్కడ జూనియర్ కాలేజీ నిర్మించాలని స్థానికులు నిరసన దిగారు. గతంలోనే ఈ స్థలంపై వివాదం నెలకొన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మరోసారి స్థానికులు ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కాలేజీ నిర్మించాల్సిందేనని ప్రజలు పట్టుబట్టారు. ఇంతవరకూ ప్రభుత్వం గానీ, అధికారులుగానీ ఈ వ్యవహారంపై స్పందించలేదు.

Advertisement

Also Read: Punganur Riots Case: పుంగనూరు అల్లర్ల కేసు.. ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట.. తుది తీర్పు తేదీ ప్రకటించిన హైకోర్టు

నాడు.. నేడు
వైసీపీ అధికారంలో ఉండగా సింధుకు 2021లో విశాఖపట్నం రూరల్‌లోని చినగదిలి మండలంలో 73/11,83/5, 6 సర్వే నెంబర్లలో పశుసంవర్థక శాఖకు చెందిన రెండు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. ఈ స్థలంలో బ్యాడ్మింటన్ అకాడ‌మీ, స్పోర్ట్స్ స్కూలు ఏర్పాటు ఏర్పాటు చేయాల్సి ఆమె భావించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు కూడా వచ్చాయి. అత్యున్నత స్థాయి మౌలిక వసతులతో అకాడమీ ఏర్పాటు చేయాలని భావించారు. తొలి దశలో అకాడమీ, ఆ తర్వాత స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్మించాలని ప్లాన్ చేశారు. రిటైర్మెంట్ అయ్యాక అకాడమీలో శిక్షణ బాధ్యతలు చేపడుతామని ప్రభుత్వానికి సింధు హామీ కూడా ఇచ్చారు. ప్రతిభ కలిగిన పేదల పిల్లలను క్రీడల్లో ప్రోత్సాహించాలని నాడు పీవీ సింధును జగన్ కోరారు. అయితే నేడు ఆ స్థలం నేడు వివాదానికి దారితీసింది. ఈ రెండు ఎకరాల స్థలం సింధుకు వద్దు.. కాలేజీ నిర్మించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Related News

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×