E-Paper
Advertisement

Palnadu: నల్లగా ఉండటమే నా తప్పా? అత్తింటి ముందు కోడలు ధర్నా

Palnadu: నల్లగా ఉండటమే నా తప్పా? అత్తింటి ముందు కోడలు ధర్నా
Advertisement

పల్నాడు జిల్లా వినుకొండలో వరకట్న వేధింపులు, రంగు పేరుతో అమానుషంగా హింసించిన సంఘటన కలకలం రేపింది. తాను నల్లగా ఉన్నాననే కారణంతో అశుభాలు జరుగుతున్నాయని, దీనికి తోడు అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తమామలు వేధిస్తున్నారంటూ గోపిలక్ష్మి అనే కోడలు తన అత్తారింటి ఎదుటే న్యాయపోరాటానికి దిగింది.

గత జూన్‌లో కోటేశ్వరరావుతో గోపిలక్ష్మికి వివాహం జరిగింది. పెళ్లైన కేవలం రెండు నెలల నుండే వేధింపులు మొదలయ్యాయని గోపిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. తోటి కోడలు రూ. 80 వేలు సంపాదిస్తుందని, తాను సంపాదించడం లేదంటూ కూడా నిత్యం నిందిస్తున్నారని ఆమె కన్నీరు పెట్టుకుంది. న్యాయం జరగాలంటూ బాధితురాలు తన అత్తారింటి ఎదుట ఆందోళన చేపట్టింది.

Advertisement

గోపిలక్ష్మి తండ్రి మీడియాతో మాట్లాడుతూ.. తన బిడ్డను కోటీశ్వరులు అని నమ్మి ఆస్తులు అమ్మి పెళ్లి చేశానని, ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధించడం అన్యాయమని అన్నారు. కనీసం తిండి కూడా పెట్టడం లేదని తన బిడ్డ చెబుతోందని వాపోయారు. ఈ విషయంపై అడగడానికి వచ్చిన తమపై దాడికి ప్రయత్నించారని, తమను చూడగానే ఇంటికి తాళం వేసి పారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన వినుకొండలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గోపిలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాడతానని ఆమె తండ్రి స్పష్టం చేశారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×