E-Paper
Advertisement

Duvvada – Divvala: తిరుమలలో దువ్వాడ, దివ్వెల మాధురి.. ఈసారి అలా..

Duvvada – Divvala: తిరుమలలో దువ్వాడ, దివ్వెల మాధురి.. ఈసారి అలా..
Advertisement

Duvvada – Divvala: రెండు తెలుగు రాష్ట్రాలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలా మాధురి అంటే తెలియని వారే ఉండరు. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ రాజకీయరంగంలో కంటే, దివ్వెలా మాధురితో జతకట్టిన సమయంలోనే రాష్ట్రస్థాయిలో పాపులారిటీ పెంచుకున్నారు.

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం తెరమీదికి వచ్చిన సమయంలో దివ్వెలా మాధురి ఎంటరయ్యారు. అప్పటినుండి వీరిద్దరూ జంటగానే పలు ఛానల్స్ లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ బంధానికి సంబంధించి ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టేశారు. అంతేకాదు గతంలో తిరుమల పర్యటన సమయంలో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే వివాహం చేసుకోనున్నట్లు మాధురి ప్రకటించారు.

Advertisement

అలాగే తిరుమలలో ఫోటోషూట్ జరుపుకున్నారన్న ఆరోపణలతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసి, కేసు కూడా నమోదు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డేను మాధురి ఘనంగా నిర్వహించగా, అంతే స్థాయిలో మాధురి పుట్టినరోజును కూడా శ్రీనివాస్ నిర్వహించారు. ఇలా ఈ జంట ఎక్కడికి వెళ్లినా వార్తల్లో నిలవడం విశేషం.

Also Read: Lakshmi Parvathi: లక్ష్మీపార్వతికి రోజుకు వేలల్లో కాల్స్.. లిఫ్ట్ చేస్తే అంతే సంగతులట

Advertisement

శనివారం మరో మారు ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతున్న సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెలా మాధురిలు జంటగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి ప్రసాదాన్ని వారు స్వీకరించారు. అయితే గతంలో పలు వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో, ఈసారి మీరు తిరుమల పర్యటనలో ఎటువంటి కామెంట్స్ చేయకుండా వెను తిరిగారు. తాము కేవలం శ్రీవారి దర్శనం కోసం వచ్చామని బదులిచ్చిన ఈ జంట, మీడియాతో మాట్లాడేందుకు కూడా విముఖత వ్యక్తం చేశారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×