E-Paper
Advertisement

Duvvada Vani: దువ్వాడ వాణి ఇన్ యాక్షన్.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ.. ఎందుకంటే?

Duvvada Vani: దువ్వాడ వాణి ఇన్ యాక్షన్.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ.. ఎందుకంటే?
Advertisement

Duvvada Vani: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ కుటుంబం పేరు మార్మోగకుండా ఉండదు. కొన్ని నెలల క్రితం వరకూ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దువ్వాడ వాణి, వేరే పక్కన వార్తల్లో నిలిచిన మాధురి.. ఈ ముగ్గురి పేర్ల చుట్టూ నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా మాధురితో దువ్వాడ శ్రీనివాస్ పెళ్లి వార్త బయటకు వచ్చాక, దువ్వాడ వాణి ఎమోషనల్‌గా స్పందించి దీక్ష చేపడుతున్నారని అనుకుంటే పొరపాటే. అయితే ఫ్యామిలీ వివాదం సమయంలో వాణి చేసిన మాటలు ఎంత సంచలనంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కాలం గడిచింది, రాజకీయాలు నిశ్శబ్దంగా మారాయి. అయితే ఇప్పుడు అదే వాణి.. మళ్లీ ఒక బిగ్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇప్పుడు దువ్వాడ వాణి ఏం చేయబోతున్నారు అంటే.. ఆమె ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాజకీయంగా పునరుజ్జీవించేందుకు కాదు, ప్రజాప్రయోజనాల కోసం. టెక్కలి మండలంలోని సర్పంచ్‌ల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.

దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్‌ వివాహం జరిగినప్పటికీ, వాణి మాత్రం రాజకీయాల్లో నిలబడటం, పబ్లిక్ ఫోరమ్స్‌లో తన హక్కును వినిపించుకోవడం ఆపలేదు. ఒక మహిళగా, ఒక నాయకురాలిగా ఆమె తన స్థానం కోల్పోకుండా ముందుకెళ్తుండటం గమనార్హం. ప్రస్తుతం వాణి టెక్కలి జెడ్పీటీసీగా కొనసాగుతుండగా, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.

Advertisement

ఇదే సమయంలో, సర్పంచ్‌లు చేస్తున్న అభివృద్ధి పనులను అధికారులు అడ్డుకుంటున్నారని, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని, నిధులు విడుదల చేయడంలో అన్యాయం జరుగుతోందని, మౌలిక వసతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఆమె వాదిస్తున్నారు.

టెక్కలిలోని ప్రధాన పంచాయతీలో పారిశుద్ధ్యం దారుణంగా ఉందని, 196 హుదూద్ ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్లు లేవని వాపోయారు. ఈ పరిస్థితుల్లో అధికారులు స్పందించకపోతే, తాను టెక్కలిలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని స్పష్టం చేశారు.

Also Read: Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయా? ఇలా తప్పక చేయండి!

దీనిపై వాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్కలి నియోజకవర్గం నుంచే కాక, జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆమె గతంలోని వ్యక్తిగత సంఘటనలు.. దువ్వాడ శ్రీనివాస్, మాధురితో వివాహం అంశాలు పక్కన పెట్టుకొని, ఇప్పుడు పూర్తిగా ప్రజాప్రయోజనాల కోసం బాటపడినట్టు కనిపిస్తుండటమే చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ నేతలుగా దువ్వాడ శ్రీనివాస్, వాణిలకు గతంలో మంచి ప్రజాదరణ ఉండేది. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా రాజకీయంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వాణి తిరిగి రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రజల సమస్యలను ముందుకు తెచ్చి పోరాట పథకంలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ప్రజలే ఈ వ్యవహారాన్ని ఎలా స్వీకరిస్తారన్నది వేచి చూడాలి.

దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్‌ పెళ్లి వ్యవహారం వల్ల రాజకీయంగా ఆమె నష్టపోయారా? లేక అదే సంఘటన ఆమెను మరింత బలంగా మార్చిందా? అన్న ప్రశ్నలకు సమాధానం ఈ ఆమరణ దీక్షతో తేలే అవకాశం ఉంది. ఒకవేళ వాణి దీక్షతో ఏదైనా సమస్య పరిష్కార దిశలో కదలిక వస్తే, అది ఆమెకు రాజకీయంగా మరింత ఊపిరిగా మారనుంది.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×