BigTV English

Duvvada Vani: దువ్వాడ వాణి ఇన్ యాక్షన్.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ.. ఎందుకంటే?

Duvvada Vani: దువ్వాడ వాణి ఇన్ యాక్షన్.. ఆమరణ నిరాహార దీక్షకు రెడీ.. ఎందుకంటే?

Duvvada Vani: శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ కుటుంబం పేరు మార్మోగకుండా ఉండదు. కొన్ని నెలల క్రితం వరకూ దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య దువ్వాడ వాణి, వేరే పక్కన వార్తల్లో నిలిచిన మాధురి.. ఈ ముగ్గురి పేర్ల చుట్టూ నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి.


ముఖ్యంగా మాధురితో దువ్వాడ శ్రీనివాస్ పెళ్లి వార్త బయటకు వచ్చాక, దువ్వాడ వాణి ఎమోషనల్‌గా స్పందించి దీక్ష చేపడుతున్నారని అనుకుంటే పొరపాటే. అయితే ఫ్యామిలీ వివాదం సమయంలో వాణి చేసిన మాటలు ఎంత సంచలనంగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కాలం గడిచింది, రాజకీయాలు నిశ్శబ్దంగా మారాయి. అయితే ఇప్పుడు అదే వాణి.. మళ్లీ ఒక బిగ్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు దువ్వాడ వాణి ఏం చేయబోతున్నారు అంటే.. ఆమె ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. రాజకీయంగా పునరుజ్జీవించేందుకు కాదు, ప్రజాప్రయోజనాల కోసం. టెక్కలి మండలంలోని సర్పంచ్‌ల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, తన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు.


దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్‌ వివాహం జరిగినప్పటికీ, వాణి మాత్రం రాజకీయాల్లో నిలబడటం, పబ్లిక్ ఫోరమ్స్‌లో తన హక్కును వినిపించుకోవడం ఆపలేదు. ఒక మహిళగా, ఒక నాయకురాలిగా ఆమె తన స్థానం కోల్పోకుండా ముందుకెళ్తుండటం గమనార్హం. ప్రస్తుతం వాణి టెక్కలి జెడ్పీటీసీగా కొనసాగుతుండగా, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు.

ఇదే సమయంలో, సర్పంచ్‌లు చేస్తున్న అభివృద్ధి పనులను అధికారులు అడ్డుకుంటున్నారని, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తున్నారని, నిధులు విడుదల చేయడంలో అన్యాయం జరుగుతోందని, మౌలిక వసతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఆమె వాదిస్తున్నారు.

టెక్కలిలోని ప్రధాన పంచాయతీలో పారిశుద్ధ్యం దారుణంగా ఉందని, 196 హుదూద్ ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్లు లేవని వాపోయారు. ఈ పరిస్థితుల్లో అధికారులు స్పందించకపోతే, తాను టెక్కలిలో ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని స్పష్టం చేశారు.

Also Read: Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయా? ఇలా తప్పక చేయండి!

దీనిపై వాణి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్కలి నియోజకవర్గం నుంచే కాక, జిల్లావ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఆమె గతంలోని వ్యక్తిగత సంఘటనలు.. దువ్వాడ శ్రీనివాస్, మాధురితో వివాహం అంశాలు పక్కన పెట్టుకొని, ఇప్పుడు పూర్తిగా ప్రజాప్రయోజనాల కోసం బాటపడినట్టు కనిపిస్తుండటమే చర్చనీయాంశంగా మారింది.

వైసీపీ నేతలుగా దువ్వాడ శ్రీనివాస్, వాణిలకు గతంలో మంచి ప్రజాదరణ ఉండేది. అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా రాజకీయంగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వాణి తిరిగి రాజకీయంగా పట్టు సాధించేందుకు ప్రజల సమస్యలను ముందుకు తెచ్చి పోరాట పథకంలోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ప్రజలే ఈ వ్యవహారాన్ని ఎలా స్వీకరిస్తారన్నది వేచి చూడాలి.

దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్‌ పెళ్లి వ్యవహారం వల్ల రాజకీయంగా ఆమె నష్టపోయారా? లేక అదే సంఘటన ఆమెను మరింత బలంగా మార్చిందా? అన్న ప్రశ్నలకు సమాధానం ఈ ఆమరణ దీక్షతో తేలే అవకాశం ఉంది. ఒకవేళ వాణి దీక్షతో ఏదైనా సమస్య పరిష్కార దిశలో కదలిక వస్తే, అది ఆమెకు రాజకీయంగా మరింత ఊపిరిగా మారనుంది.

Related News

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Big Stories

×