E-Paper
Advertisement

Earthquake in Prakasam District: ముండ్లమూరులో మరోమారు భూ ప్రకంపనలు.. ఆ భయం వద్దంటున్న శాస్త్రవేత్తలు

Earthquake in Prakasam District: ముండ్లమూరులో మరోమారు భూ ప్రకంపనలు.. ఆ భయం వద్దంటున్న శాస్త్రవేత్తలు
Advertisement

Earthquake in Prakasam District: ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్పంగా భూ ప్రకంపనల ప్రభావం గురువారం కనిపించింది. 2024 సంవత్సరం డిసెంబర్ నెలలో ఒకేసారి మూడుసార్లకు పైగా భూ ప్రకంపనలు రావడంతో జిల్లా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తాజాగా మరో మారు స్వల్పంగా భూమి కంపించడంతో, వరుస భూ ప్రకంపనలకు గల కారణాలను అన్వేషించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రకాశం జిల్లా ముండ్లమూరులో గురువారం మరోసారి స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. అది కూడా మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు. ముండ్లమూరులో డిసెంబర్ 21 నుండి వరుసగా మూడు రోజులు భూ ప్రకంపనులు రావడంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అయితే ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలపై శాస్త్రవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అందుకు గల కారణాలను అన్వేషిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Advertisement

Also Read: AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. తిరుపతి ప్రజలకు గుడ్ న్యూస్.. పిఠాపురంపై కీలక నిర్ణయం

గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతం కావడంతో భూకంపాలు వచ్చే అవకాశాలు స్వల్పంగా ఉంటాయని, ఈ విషయంపై ప్రజలు ఆందోళన చెందకుండా ఉండాలంటూ శాస్త్రవేత్తలు కోరుతున్నారు. అనవసరంగా ప్రజలు భయాందోళన చెంది మానసికంగా ఇబ్బందులు పడవద్దని తెలిపారు. ఈ దశలో మరోమారు గురువారం సైతం స్వల్పంగా కంపించడంతో ప్రజలు గృహాల నుండి బయటకు వచ్చి చర్చలు సాగించిన పరిస్థితి. ఏది ఏమైనా స్వల్పంగా భూమి కంపించడంపై, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×