E-Paper
Advertisement

ED Notice to Vijaysaireddy: విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు, సారీ బిజీ అంటూ..

ED Notice to Vijaysaireddy: విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు, సారీ బిజీ అంటూ..
Advertisement

ED Notice to Vijaysaireddy: కాకినాడ సీ పోర్టు, సెజ్‌ల వాటాల కేసు వ్యవహారం వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే సీఐడీ దర్యాప్తు చేస్తోంది. దాని ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వైవీ విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకెఎప్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్ పీ ప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నోటీసులకు సంబంధిత నిందితులు జవాబులు కూడా ఇచ్చారట.

Advertisement

పార్లమెంటు సమావేశాలు ఉండడం వల్ల తాను రావడం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చినట్టు సమాచారం. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం రాలేనని విక్రాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం విచారణకు రావడం కష్టమని, మరోసారి వస్తానని శరత్ చంద్రరెడ్డి జవాబు ఇచ్చారట. నోటీసులు అందుకున్న నిందితులు ఏదో కుంటి సాకు చెబుతూ ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యారు.

ఈ నేపథ్యంలో వీరందరికీ మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తోందట ఈడీ. కేవీ రావు నుంచి లబ్దిదారైన అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలను బెదిరింపులకు పాల్పడి బదలాయించుకున్నారని కేవీ రావు తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

Advertisement

ALSO READ: తిరుమలలో కానిస్టేబుల్ ఘరానా మోసం.. ఏకంగా ఎమ్మేల్యే సిఫార్సు లేఖతోనే.. అసలేం జరిగిందంటే?

కాకినాడ సీ పోర్టుకు సంబంధించి 2500 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాను కేవలం 494 కోట్లు, అలాగే సెజ్‌లోని 1100 కోట్లకు పైగా విలువ చేసే వాటాలను కేవలం 12 కోట్లకు అరబిందో సంస్థకు దక్కించుకునేది ప్రధాన సారాంశం. అయితే ఈ వ్యవహారం మనీలాండరింగ్ కు సంబంధించినది కావడంతో ఈడీ ఫోకస్ చేసిన విషయం తెల్సిందే.

శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీఎస్ఆర్ హాజరైతే హాజరవ్వాలనే ఆలోచనలో మిగతా నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికీ నిందితులు దేనికీ రియాక్ట్ కాకపోతే అరెస్టు ఖాయమనే ప్రచారం లేకపోలేదు.

ఇన్నాళ్లు గుట్టుగా సాగిన కాకినాడ పోర్టు వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారట ఆయా నిందితులు. సీఐడీ విచారణలో కొత్త విషయాలు బయటపడితే  ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×