BigTV English

ED Notice to Vijaysaireddy: విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు, సారీ బిజీ అంటూ..

ED Notice to Vijaysaireddy: విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు, సారీ బిజీ అంటూ..

ED Notice to Vijaysaireddy: కాకినాడ సీ పోర్టు, సెజ్‌ల వాటాల కేసు వ్యవహారం వైసీపీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే సీఐడీ దర్యాప్తు చేస్తోంది. దాని ఎఫ్ఐఆర్ ఆధారంగా రంగంలోకి దిగేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.


ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న వైవీ విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, శరత్ చంద్రారెడ్డి, పీకెఎప్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్ పీ ప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నోటీసులకు సంబంధిత నిందితులు జవాబులు కూడా ఇచ్చారట.

పార్లమెంటు సమావేశాలు ఉండడం వల్ల తాను రావడం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి రిప్లై ఇచ్చినట్టు సమాచారం. అనారోగ్యం కారణంగా ప్రస్తుతం రాలేనని విక్రాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం విచారణకు రావడం కష్టమని, మరోసారి వస్తానని శరత్ చంద్రరెడ్డి జవాబు ఇచ్చారట. నోటీసులు అందుకున్న నిందితులు ఏదో కుంటి సాకు చెబుతూ ఈడీ విచారణకు గైర్హాజరు అయ్యారు.


ఈ నేపథ్యంలో వీరందరికీ మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తోందట ఈడీ. కేవీ రావు నుంచి లబ్దిదారైన అరబిందో రియాల్టీ అండ్ ఇన్‌ఫ్రా కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోందని తెలుస్తోంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే వాటాలను బెదిరింపులకు పాల్పడి బదలాయించుకున్నారని కేవీ రావు తన ఫిర్యాదులో ప్రస్తావించారు.

ALSO READ: తిరుమలలో కానిస్టేబుల్ ఘరానా మోసం.. ఏకంగా ఎమ్మేల్యే సిఫార్సు లేఖతోనే.. అసలేం జరిగిందంటే?

కాకినాడ సీ పోర్టుకు సంబంధించి 2500 కోట్ల రూపాయలు విలువ చేసే వాటాను కేవలం 494 కోట్లు, అలాగే సెజ్‌లోని 1100 కోట్లకు పైగా విలువ చేసే వాటాలను కేవలం 12 కోట్లకు అరబిందో సంస్థకు దక్కించుకునేది ప్రధాన సారాంశం. అయితే ఈ వ్యవహారం మనీలాండరింగ్ కు సంబంధించినది కావడంతో ఈడీ ఫోకస్ చేసిన విషయం తెల్సిందే.

శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి విచారణకు హాజరవుతారా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీఎస్ఆర్ హాజరైతే హాజరవ్వాలనే ఆలోచనలో మిగతా నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటికీ నిందితులు దేనికీ రియాక్ట్ కాకపోతే అరెస్టు ఖాయమనే ప్రచారం లేకపోలేదు.

ఇన్నాళ్లు గుట్టుగా సాగిన కాకినాడ పోర్టు వ్యవహారం వెలుగులోకి రావడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారట ఆయా నిందితులు. సీఐడీ విచారణలో కొత్త విషయాలు బయటపడితే  ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related News

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Big Stories

×