BigTV English
Advertisement

Shiva Swamy Baba: ఏలూరులో కారంతో అభిషేకం చేయించుకున్న స్వామీజి.. ఎందుకలా? ప్రత్యేకత ఏమిటీ?

Shiva Swamy Baba: ఏలూరులో కారంతో  అభిషేకం చేయించుకున్న స్వామీజి.. ఎందుకలా? ప్రత్యేకత ఏమిటీ?

Shiva Swamy Baba: కారం అంటే మనకు కారమే కదా.. జస్ట్ అలా కారం మన శరీరానికి తాకిందంటే చాలు.. కుయ్యో, మొర్రో అనాల్సిందే. కానీ ఇక్కడ ఓ బాబా వారు ఏకంగా కారంతోనే అభిషేకం చేయించుకున్నారు. అది కూడా భక్తులు ఏకంగా 50 కేజీల కారంను స్వామీజీపై పోయగా, స్వామి వారు అలాగే ఉండి పోయారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో..


ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమం ఉంది. ఈ వృద్ధాశ్రమంలో ప్రత్యంగిరా దేవి ఆలయం కూడా వెలసి ఉంది. ఈ ఆలయంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారుగా.. ప్రత్యంగిరా దేవి ఇక్కడ ప్రాచుర్యం పొందారు. అలాగే ఇక్కడ శివస్వామి బాబా వారు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. అయితే ప్రత్యంగిరా దేవి అమ్మవారికి కారం అంటే ఇష్టమని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయంలో అమ్మవారికి భక్తులు కారం కూడా సమర్పిస్తుంటారు.

ఈ ఆలయంలో ఒక వింత ఆచారం కూడా మూడేళ్లుగా కొనసాగుతోంది. స్వస్తిశ్రీ చాంద్రమానేన బహుళ పంచమి తిథి రోజు శివస్వామి బాబాకు ఇక్కడి భక్తులు కారంతో అభిషేకం చేస్తారు. అందులో భాగంగానే నిన్న రాత్రి బాబా వారికి కారంతో అభిషేకం చేశారు. ముందుగా గ్రామోత్సవం నిర్వహించి, అనంతరం శివ దత్తాత్రేయ ప్రత్యంగిరా వృద్ధాశ్రమంలో బాబా వారిని కుర్చీలో కూర్చోపెట్టారు. అనంతరం ఒక్కొక్క భక్తుడు, భక్తురాలు తమ చేతిలో కారం తీసుకొని శివస్వామి బాబా ఒంటిపై పోయడం ప్రారంభించారు.


Also Read: TTD News: టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు విరాళం ఇవ్వనున్నారా.. జస్ట్ స్కాన్ చేస్తే సరి.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే?

ఈ క్రమంలో అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ.. బాబా వారు భక్తులకు ఆశీర్వదించారు. సాధారణంగా మనకు కారం కొద్దిగా తగిలిన వెంటనే.. అమ్మో మంట అనే కేకలు వేస్తాం. కానీ బాబా వారు మాత్రం సాధారణంగా ఉన్నట్లుగానే అలాగే ఉండి పోయారు. ఈ సంప్రదాయానికి ప్రధాన కారణంగా కారం అంటేనే అమ్మవారికి ఇష్టమని, అందుకు ఈ పరంపర సాగిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారు ఎంతో మహిమ గల వారని, అందుకే శివస్వామి బాబా వారికి కారం ఎటువంటి ప్రభావం చూపలేదని భక్తులు తెలిపారు.

Related News

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Big Stories

×