E-Paper
Advertisement

Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం
Advertisement

Documents burnt: ఏపీలో మరో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. భూసేకరణకు సంబంధించిన పరిహారం ఫైళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఫైల్స్ కాలిబూడిదయ్యాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ చేట్టింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. కీలకమైన ఫైల్స్ మంటల్లో కాలిపోయాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లకు ఎవరో నిప్పు పెట్టారు. భూసేకరణకు సంబంధించి లబ్దిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడుతాయనే కాల్చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరున్నా కూడా వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Also Read: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. మంత్రి రియాక్షన్

Advertisement

ఇదిలా ఉంటే.. ఇలాంటి ఓ ఘటన కూడా ఏపీలో ఇటీవలే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడడంతో ఆఫీసులో ఉన్న కీలకమైన ఫైల్స్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుని మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. రాష్ట్ర డీజీపీ కూడా సంఘటనా స్థలిని సందర్శించి పరిశీలించారు. అనంతరం పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఘటనకు సంబంధించి పలువురు అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×