BigTV English

Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

Documents burnt: ఏపీలో మరో ఘటన.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం

Documents burnt: ఏపీలో మరో అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. భూసేకరణకు సంబంధించిన పరిహారం ఫైళ్లకు నిప్పుపెట్టారు. దీంతో ఫైల్స్ కాలిబూడిదయ్యాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం విచారణ చేట్టింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధమయ్యాయి. కీలకమైన ఫైల్స్ మంటల్లో కాలిపోయాయి. ఎడమ కాలువ భూసేకరణకు సంబంధించిన ఫైళ్లకు ఎవరో నిప్పు పెట్టారు. భూసేకరణకు సంబంధించి లబ్దిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటపడుతాయనే కాల్చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఎవరున్నా కూడా వారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.


Also Read: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. మంత్రి రియాక్షన్

ఇదిలా ఉంటే.. ఇలాంటి ఓ ఘటన కూడా ఏపీలో ఇటీవలే చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. అవి భారీగా ఎగిసిపడడంతో ఆఫీసులో ఉన్న కీలకమైన ఫైల్స్, కంప్యూటర్లు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుని మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. రాష్ట్ర డీజీపీ కూడా సంఘటనా స్థలిని సందర్శించి పరిశీలించారు. అనంతరం పలు అనుమానాలను కూడా వ్యక్తం చేశారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఘటనకు సంబంధించి పలువురు అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.


Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×