E-Paper
Advertisement

Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. మంత్రి రియాక్షన్

Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. మంత్రి రియాక్షన్
Advertisement

Gas Cylinder Blast in Kadapa: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తోగట వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు తల్లి రమాదేవి, కొడుకు ప్రభు మనోహర్, కూతురు మన్విత లుగా గుర్తించారు. ఆ ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రమాదేవి భర్త రాజా.. జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లి.. అక్కడే పనిచేస్తున్నాడు. రమాదేవి స్థానికంగా టైలరింగ్ పనిచేస్తూ.. పిల్లల్ని చూసుకుంటోందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పటికే ముగ్గురూ మరణించడంతో.. పోస్టుమార్టంకు తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక ఎవరైనా కావాలని చేశారా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

Advertisement

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మృతదేహాలకు నివాళులు అర్పించి.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరమన్నారు. అలాగే.. ఎవరికైనా ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కార మార్గాలను చూడాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ చేయాలని, దీనికి వేరెవరైనా బాధ్యులైతే.. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×