E-Paper
Advertisement

Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. మంత్రి రియాక్షన్

Gas Cylinder Blast: గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి.. మంత్రి రియాక్షన్
Advertisement

Gas Cylinder Blast in Kadapa: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తోగట వీధిలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మృతులు తల్లి రమాదేవి, కొడుకు ప్రభు మనోహర్, కూతురు మన్విత లుగా గుర్తించారు. ఆ ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

రమాదేవి భర్త రాజా.. జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్లి.. అక్కడే పనిచేస్తున్నాడు. రమాదేవి స్థానికంగా టైలరింగ్ పనిచేస్తూ.. పిల్లల్ని చూసుకుంటోందని స్థానికులు పోలీసులకు తెలిపారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకునే సరికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. అప్పటికే ముగ్గురూ మరణించడంతో.. పోస్టుమార్టంకు తరలించి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక ఎవరైనా కావాలని చేశారా ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు.

Advertisement

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిశీలించారు. మృతదేహాలకు నివాళులు అర్పించి.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించడం బాధాకరమన్నారు. అలాగే.. ఎవరికైనా ఎలాంటి సమస్యలున్నా వాటి పరిష్కార మార్గాలను చూడాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ ఘటనపై న్యాయవిచారణ చేయాలని, దీనికి వేరెవరైనా బాధ్యులైతే.. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×