Sidda house robbery attempt: సందట్లో సడేమియా అంటే ఇదేనేమో.. ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉండడం గమనించారు దొంగలు. సరిగ్గా నేతల ఇళ్లనే టార్గెట్ చేశారు. కాకపోతే వాచ్మేన్, గన్మెన్ అలర్ట్గా ఉండడంతో దొంగలు పరారయ్యారు. ఈ ఘటన ఒంగోలులోని మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ఇంట్లో చోటు చేసుకుంది. అసలేం జరిగింది?
ఒంగోలు మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇళ్లు దోపిడికీ విఫలయత్నం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి పన్నెండున్నర గంటల సమయంలో ఇద్దరు దొంగలు కత్తులతో శిద్ధా ఇంట్లోకి ప్రవేశించారు. ఇంటికి కాపలాగా ఉన్న వాచ్మేన్ దుర్గాప్రసాద్పై దృష్టిపెట్టారు. వాచ్మేన్పై దాడి చేసి ఆయన్ని తమ కంట్రోల్ లోకి తీసుకోవాలని భావించారు ఆ దొంగలు. అయితే ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో గదిలో నిద్రిస్తున్న గన్మెన్ అలర్ట్ అయ్యారు. ఆయన రావడంతో అక్కడి నుంచి ఇద్దరు దుండగులు పరారయ్యారు. ఈ విషయాన్ని వెంటనే వన్ టౌన్ పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు.
ఈ వ్యవహారంపై మాజీమంత్రి శిద్దా కొడుకు, టీడీపీ బోర్డు సభ్యుడు సుధీర్బాబు రియాక్టయ్యారు. ఇద్దరు దుండగులు కత్తులతో ఇంట్లోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయని, అయితే వస్తువులు ఏమీ చోరీ కాలేదన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పినట్టు వెల్లడించారు.
మాజీ మంత్రి ఇంట్లో చోరీ
వైరల్ అవుతున్న వీడియో
ఒంగోలులో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఇంట్లోకి అర్థరాత్రి చొరబడిన ఇద్దరు దుండగులు.
కాపలాగా ఉన్న వాచ్ మెన్ పై దాడికి యత్నం.
వాచ్ మెన్ కేకలు వేయటంతో పరారైన దుండగులు.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.… pic.twitter.com/setrtfucHA
— BIG TV Breaking News (@bigtvtelugu) April 27, 2024