E-Paper
Advertisement

YSRCP: వైసీపీలో డిష్యూం డిష్యూం.. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల ఫైటింగ్..

YSRCP: వైసీపీలో డిష్యూం డిష్యూం.. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరుల ఫైటింగ్..
Advertisement

YSRCP: తెలంగాణతో పోల్చితే ఏపీ రాజకీయాలు ఎప్పుడూ ఉద్రిక్తంగానే ఉంటాయి. గొడవలు, హత్యలతో రచ్చ రచ్చగా నడుస్తుంటాయి. ఇటీవలి మాచర్లలో టీడీపీ వర్సెస్ వైసీపీ పొలిటికల్ ఫైట్.. ఓ రేంజ్ లో సాగింది. అట్లుంటది ఏపీలో.

ఎప్పుడూ టీడీపీ, జనసేనపైనేనా దాడులు.. ఓసారి తమలో తాము కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నట్టున్నారు వైసీపీ శ్రేణులు. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఎంపీ, ఎమ్మెల్యే సాక్షిగా ఇరువర్గాలు తీవ్రంగా కొట్టుకున్నాయి.

Advertisement

నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్‌ పర్యటనలో పాల్గొనేందుకు ఎంపీ బాలశౌరితో పాటు ఆయన అనుచరులు వచ్చారు. ఆ సమయానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తన వర్గంతో అక్కడే ఉన్నారు. ఇరు పక్షాలకు ఎవరంటే ఒకరికి పడదు. ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు ఎదురుపడగానే.. కంట్రోల్ తప్పారు. పరస్పరం చితక్కొట్టుకున్నారు. చెప్పులతో దాడి చేసుకున్నారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా వారినీ లెక్కచేయలేదు. ఆ గొడవను షూట్ చేస్తున్న ఓ జర్నలిస్టు ఫోన్‌ను లాక్కొని పగలగొట్టారు. ఒక దశలో ఎమ్మెల్యే రమేష్‌బాబుపై కూడా ఎంపీ వర్గీయులు దాడి చేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పింది.

ఇటీవల సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనకు వచ్చినప్పుడు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు వర్గీయుల మధ్య ఫ్లెక్సీల విషయంలో వివాదం ఏర్పడింది. అది మనసులో ఉంచుకుని.. దొరికిందే ఛాన్స్ అంటూ నాగాయలంకలో బాహాబాహీకి దిగారు. అంతా వైసీపీ కార్యకర్తలే కావడంతో పోలీసులు ఈ కేసును ఎలా డీల్ చేస్తారో?

Tags

Related News

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

Big Stories

Advertisement
×