Signature Forgery: శ్రీ సత్య సాయి జిల్లా పి.జి.ఆర్.ఎస్లో ఓ కేటు గాడు దారునానికి ఓడిగట్టాడు. ఫోర్జరీ సంతకంతో ఎకంగా జిల్లా కలెక్టర్నే బురిడీ కొట్టించాడు. వివరాల్లోకి వెలితే.. గాండ్లపెంట మండలం చిన్నక్క గారి పల్లిలో భూ సమస్యపై అదే గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి అనే వ్యక్తి సంతకాన్ని ఫోర్జరీ చేసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు.
Also Read: చంద్ర బాబు పాలనపై అంబటి పంచ్లు.. ఆయన వస్తే వర్షాలు రావట!
దీంతో జిల్లా కలెక్టర్ గ్రామానికి రెవెన్యూ అధికారులలకు ఆదేశాలు జారీ చేశాడు. దీంతో రెవెన్యు అధికారులు నరసింహారెడ్డిని ఈ విషయంపై అడగగా తనకేమి తెలియదనడంతో రెవెన్యు అధికారుల ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దీంతో అసలు విషయం బైటపడగానే గ్రామంలో గొడవలు మోదలయ్యాయి. దీంతో నర్సింహ్మరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సంతకం ఫోర్జరీ చేసి కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. గాండ్లపెంట తహసిల్దార్కు కదిరి రూరల్ సిఐకి నర్సింహ రెడ్డి ఫిర్యాదు చేసాడు.
Also Read: ఎర్రబస్సు అన్నోడికి… ఎయిర్బస్ క్రెడిటా? జగన్పై విరుచుకుపడ్డ ఎంపీ కలిశెట్టి!