BigTV English

Tammineni Seetaram: తప్పు ఆవులదేనా? తిరుమల లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని స్పందన ఇది

Tammineni Seetaram: తప్పు ఆవులదేనా? తిరుమల లడ్డూ వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని స్పందన ఇది

Tammineni Seetaram: తిరుపతి లడ్డూ వివాదంపై ఏపీలో పెద్ద దుమారమే రేగుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరుపై ఒకరు బురద చల్లుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడేందుకు ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ముందుకొచ్చారు. మంగళవారం ఆముదాలవలసలో తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ వివాదం వెనుక దాగివున్న కుట్రను సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఉన్నత స్థితికి చేర్చారు. ప్రసాదం కోసం వాడే పదార్థాల్లో నాణ్యత విషయంలో లోపభూయుష్టంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే, సరఫరా చేసే అటువంటి గుత్తేదారు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టాం. నెయ్యి క్వాలిటీ విషయంలో టీటీడీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత సరిగ్గా లేని నెయ్యి ట్యాంకర్లను 14 సార్లు చంద్రబాబు హయాంలో వెనక్కి పంపిస్తే, 18సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనక్కి పంపించాం’’ అని తెలిపారు.


Also Read: జగన్‌కు నిమ్మకాయల లేఖ.. మీ వెంట నడవలేకపోతున్నామంటూ…

‘‘ఈ రెండింటినీ పరిశీలిస్తే ఎవరి పాలనలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీపడకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కోట్ల మంది స్వామి వారి భక్తులను తీవ్ర ఆందోళనలోకి నెట్టే పని చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు గమనించాలి. దీని వెనుక దాగివున్న కుట్ర, నిజ నిజాలు ఏమిటో.. వాస్తవాలు ఏమిటో తేలాల్సి ఉంది. తిరుమల విశిష్టతను, మన వెంకటేశ్వర స్వామిని ప్రపంచం నలుదిక్కుల చాటాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు ఉంటుంది. వీటన్నింటినీ పక్కనపెట్టి రాజకీయాలు చేయాలని చూడటం నిస్సిగ్గుగా బాధాకరం. కలియుగ దైవాన్ని పూజించే కోట్లాదిమంది భక్తులు చంద్రబాబు తీరు పట్ల ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూటమినేతలు గుర్తుంచుకోవాలి’’ అంటూ ఆయన పేర్కొన్నారు.


Also Read: మా లడ్డూలో పొగాకు లేదు.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ.. ఏం జరిగింది ?

పోషకాహార లోపం ఉన్న ఆవుల వల్లే…

‘‘మాపై ఆరోపణలు చేసే ముందు కూటమి నేతలు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు ఆరోపిస్తున్నట్లుగా లడ్డూలో ఇతర పదార్థాలు కలిస్తే అలాంటి నెయ్యిని లోపలికి పోనిచ్చింది ఎవరూ.. మీరే కదా..? అప్పుడు తప్పు మీదే అవుతుంది కదా? దీనిపై ల్యాబ్ రిపోర్టులో స్పష్టంగా చెప్పారు. పోషకాహార లోపం ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి కారణమంటూ పేర్కొంది. ఊ ఈ విషయాలు తెలియకుండా మాపై ఆరోపణలు సరికాదు’ అంటూ ఆయన అన్నారు. గ్రామాల్లో అనేక పసువులను మనం చూస్తాం. అవి చాలా తింటాయి. అవి తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి పాలతో చేసే నెయ్యి వల్ల అలా జరుగుతుంది’’ అంటూ కొత్త లాజిక్ చెప్పారు తమ్మినేని.

Related News

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

AP Free Coaching: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

Jagan Assembly: ఈ మాస్ ర్యాగింగ్ ని జగన్ తట్టుకోగలరా? వైసీపీ వ్యూహం ఏంటి?

Dasara 2025: దసరా సంబరాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి.. ఈ ఏడాది 11 రోజుల పాటు ఉత్సవాలు

Vijayawada Durga Festival: 10,000 సీసీ కెమెరాలతో.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులకు భారీ బందోబస్తు

Tirumala Brahmotsavam 2025: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహోత్సవాల డేట్స్ వచ్చేశాయ్

Big Stories

×