E-Paper
Advertisement

Former MLA Passed Away: ఏపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ మృతి

Former MLA Passed Away: ఏపీ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ మృతి
Advertisement

Former MLA Rammohan Rao passed away(Andhra news today): విజయనగరం జిల్లాలోని బొబ్బిలి నియోజకవర్గం ఎంపీ, చీపురపల్లి మాజీ ఎమ్మెల్యే కేంబూరి రామ్మోహనరావు(75) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను విశాఖలోని ఓ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ మేరకు రామ్మోహనరావుకు ఐసీయూలో ప్రముఖ వైద్యుల సమక్షంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో బుధవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందారు.

టీడీపీ నుంచి 1985లో చీపురపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కేంబూరి రామ్మోహనరావు.. 1989 వరకు కొనసాగారు. ఆ తర్వాత 1989లో టీడీపీ సభ్యుడిగా బొబ్బిలి నుంచి 9వ లోక్ సభలో ఘన విజయం సాధించారు.. పేదల అభివృద్ధి కోసం నిరంతరం తపనపడేవారు. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Advertisement

Also Read: జగన్‌కు సంకేతాలు.. బొత్స ఓటమి ఖాయం! జీవీఎంసీ ఎన్నికల్లో..

1949 అక్టోబర్ 12న శ్రీకాకుళం జిల్లా పుర్లిలో జన్మించారు. ఈయన విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో విద్యాభ్యాసం అభ్యసించారు. 1974లో రుషిని వివాహం చేసుకున్నారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చురుకుగా పనిచేసేవారు. అయితే, కెంబూరి మరణవార్త తెలుసుకున్న రాజకీయ ప్రముఖులతోపాటు టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×