E-Paper
Advertisement

Bandaru Satyaranarayana: రాజకీయాలకు మాజీ మంత్రి బండారు గుడ్ బై

Bandaru Satyaranarayana: రాజకీయాలకు మాజీ మంత్రి బండారు గుడ్ బై
Advertisement
Bandaru Satyaranarayana
Bandaru Satyaranarayana

Bandaru Satyaranarayana: అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు ఆశాభంగం కలిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన రాజకీయలకు గుడ్ బై చెప్పారు.

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా బండారు సత్యనారాయణ విశాఖ జిల్లా పెందుర్తి సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన నేత పంచకర్ల రమేశ్ కు దక్కింది. దీంతో ఆయన తీవ్ర అంసతృప్తికి గురయ్యారు. అయితే పార్టీ తన నిర్ణయం మార్చుకుని చివరి లిస్ట్ లో అయినా తన పేరును ప్రకటిస్తుందేమోనని వేచి చూశారు. చివరి జాబితాలో కూడా ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించలేదు. దీంతో పార్టీ మారడం ఇష్టం లేని ఆయన రాజకీయలకు స్వస్థి పలికారు.

Advertisement

ఇటీవలే పెందుర్తి టికెట్ జనసేన నేతకు కేటాయించడంతో ఈయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వెంటనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగాయి. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సత్యనారాయణను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే టీడీపీ బండారుకు టికెట్ కేటాయించకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ వాటన్నింటీకి బండారు సత్యనారాయణ చెక్ పెట్టారు.

Also Read: Pawan Kalyan: వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. పవన్ కళ్యాణ్

Advertisement

విశాఖలోని పరవాడ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు సత్యనారాయణ ప్రకటించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయంగా తనకు ఇదే చివరి సమావేశం అని కూడా కార్యకర్తలకు, అభిమానులకు తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నాసరే.. పార్టీ కార్యకర్తలకు మాత్రం అండగానే ఉంటానని హామీ ఇచ్చారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×