BigTV English
Advertisement

Kuppam Woman Incident: కుప్పం మహిళ ఘటనలో.. నలుగురు అరెస్ట్..

Kuppam Woman Incident: కుప్పం మహిళ ఘటనలో.. నలుగురు అరెస్ట్..

Kuppam Woman Incident: చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళపై దాడిచేసిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులని కోర్టులో ప్రవేశ పెట్టగా రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ఆ నలుగురుని మదనపల్లి సబ్‌ జైలుకు తరలించారు పోలీసులు.


కుప్పం నియోజకవర్గంలో అప్పు వసూలు కోసం.. మహిళను చెట్టుకు కట్టి కొట్టారు నిందితులు. మహిళపై అమానుషం ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత మహిళ శిరీషను ఫోన్‌లో సీఎం పరామర్శించారు. నారాయణపురంలో జరిగిన ఘటన గురించి మహిళను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని శిరీషకు సూచించారు. బాధిత మహిళలకు 5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలకు సీటు ఇవ్వాలని సీఎంని కోరింది బాధిత మహిళ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.

కాగా.. చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో.. సకాలంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకి కట్టేశారు. అసభ్య పదజాలంతో దూషించాడు.


గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర శిరీష భర్త 80వేలు అప్పుగా తీసుకున్నాడు. మూడేళ్లుగా అప్పు తిరిగి చెల్లించలేదు. పైగా శిరీష భర్త తిమ్మరయప్ప ఆరు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమెను చెట్టుకు కట్టేశాడు. మునికన్నప్ప బంధువులు శిరీషపై దాడి కూడా చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో.. అప్పు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. అంతేకాదు శిరీష కుమార్తు మధుశ్రీ వికలాంగ పింఛన్‌ను.. మూడు నెలలుగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన ఘటనపై డీఎస్పీ పార్థసారథి రియాక్ట్ అయ్యారు. నలుగురు నిందితులని అరెస్ట్ చేశామన్నారు. వాట్సాప్‌లో ఫోటో రాగానే ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీసినట్టు చెప్పారు. నలుగురిపై అటెంప్ట్ టూ మర్డర్ కేసు నమోదు చేశామని తెలిపారు. ఇది ఏ రాజకీయ, కులానికి సంబంధించిన ఇష్యూ కాదని తేల్చి చెప్పారు. బాధితురాలు పిల్లల TC తీసుకోవడానికి గ్రామానికి రాగా.. నిందుతులు దౌర్జన్యంగా అడ్డుకొని చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగిందన్నారు. ఈఘటన ఆర్థిక లావాదేవిలా కారణంగానే జరిగిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు డీఎస్పీ పార్థసారథి.

Also Read: భర్త పరార్.. భార్యను చెట్టుకు కట్టేసి.. వడ్డీ వ్యాపారి ఏం చేశాడంటే..

కుప్పంలో మహిళపై జరిగిన దాడి ఘటనపై.. స్పందించారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ. భర్త అప్పు తీర్చలేదని భార్యపై దాడి చేయడం బాధాకరమన్నారు. బాధితురాలిని వీడియో కాల్‍లో పరామర్శించిన ఆమె.. ఆధునిక సమాజంలో ఇలాంటి పాశవిక ఘటనలు సిగ్గుచేటన్నారు. ఫోన్‌లో జిల్లా ఎస్పీ నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నరాయపాటి శైలజ బాధితులకు అండగా ఉండాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

Related News

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Big Stories

×